40ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటాలి: చంద్రబాబు
తెదేపా పండగ మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. 40ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా మహానాడు ఉండాలని వెల్లడించారు.
ఈనాడు, అమరావతి: తెదేపా పండగ మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. 40ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా మహానాడు ఉండాలని వెల్లడించారు. మహానాడుపై కమిటీలతో చంద్రబాబు సమీక్షించి పలు సూచనలు చేశారు. తొలి రోజు జరిగే ప్రతినిధుల సభకు 12వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు చంద్రబాబుకు పార్టీ నేతలు వివరించారు. రెండో రోజు జరిగే బహిరంగ సభను భారీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ‘అటు అధికారులు కావొచ్చు.. ఇటు ప్రభుత్వంలోని వ్యక్తులు కావొచ్చు.. వీటికి భవిష్యత్తులో మూల్యం చెల్లిస్తారు’ అని హెచ్చరించారు. మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి 15 తీర్మానాలు ఉండే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్