అభివృద్ధిపై బహిరంగ చర్చకు మంత్రి బొత్స సిద్ధమా?
‘రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ చలవే.. ఈ విషయంపై చర్చించడానికి విజయనగరంలోనే బహిరంగ వేదికకు రావడానికి మంత్రి బొత్స సత్యనారాయణ సిద్ధమేనా?’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్
గరివిడి, న్యూస్టుడే: ‘రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ చలవే.. ఈ విషయంపై చర్చించడానికి విజయనగరంలోనే బహిరంగ వేదికకు రావడానికి మంత్రి బొత్స సత్యనారాయణ సిద్ధమేనా?’ అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సవాల్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారని విమర్శించారు. విజయనగరం జిల్లా గరివిడిలో భాజపా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాజపా విధానమేంటని ప్రశ్నిస్తున్న బొత్స వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. రహదారులను అధ్వానంగా మార్చడం రాష్ట్ర ప్రభుత్వ విధానమైతే.. విజయనగరం నుంచి రాయ్పుర్ వరకు నాలుగు వరుసల రహదారులను నిర్మించడం భాజపా విధానమని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి