కర్ణాటక హైకోర్టులో ఎమ్మెల్సీ వాకాటికి చుక్కెదురు
ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని ఆయన పెట్టుకున్న
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే: ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీకి చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డికి కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని ఆయన పెట్టుకున్న అర్జీని జస్టిస్ కె.నటరాజన్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించినట్లు సంబంధిత అధికారులు మంగళవారం వెల్లడించారు. కేసును రద్దు చేసేందుకు సరైన కారణాలు కనిపించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే వీఎన్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ 2014-15లో బెంగళూరులోని భారతీయ పారిశ్రామిక ఆర్థిక సంస్థ నుంచి రూ.190 కోట్ల రుణం తీసుకుంది. తిరిగి చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి రూ.205 కోట్లు నష్టం వచ్చిందని ఆ సంస్థ ప్రతినిధులు సీబీఐకి ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్