తుని ఘటనలో వైకాపా వాళ్లుంటే అప్పుడెందుకు అరెస్ట్‌ చేయలేదు?: ఆర్కే రోజా

అమలాపురం ఘటనపై చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టే జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చదువుతున్నారని పర్యాటకశాఖ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. సచివాలయంలో మంత్రి బుధవారం విలేకరులతో మాట్లాడారు.

Updated : 26 May 2022 11:36 IST

ఈనాడు, అమరావతి: అమలాపురం ఘటనపై చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టే జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చదువుతున్నారని పర్యాటకశాఖ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. సచివాలయంలో మంత్రి బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘తుని గొడవలను వైకాపా చేయించిందని అప్పట్లోనూ పవన్‌ అన్నారు. ఆ ఘటనలో వైకాపావాళ్లుంటే.. మీ పాలనలో ఎందుకు అరెస్టు చేయించలేకపోయారు? కోనసీమ ఘటన వెనుక ఎవరున్నారో ప్రజలు గ్రహించాలి. వీరంతా రేపు ఓట్ల కోసం మీ దగ్గరకొస్తే మూతి పగిలేలా తీర్పు ఇవ్వండి. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడితే గొడవలు చేయడమేంటి? అంబేడ్కర్‌ పేరు పెట్టాలని ఇవే ప్రతిపక్షాలు గతంలో దీక్షలు చేశాయి’ అని రోజా పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని