విక్రమ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) హరీంధిర ప్రసాద్‌కు రెండు సెట్ల పత్రాలు అందజేశారు.

Updated : 03 Jun 2022 05:55 IST

ఆత్మకూరు, న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉపఎన్నికలో వైకాపా అభ్యర్థిగా మేకపాటి విక్రమ్‌రెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) హరీంధిర ప్రసాద్‌కు రెండు సెట్ల పత్రాలు అందజేశారు. ఆయన తన తల్లిదండ్రులు మణిమంజరి, రాజమోహన్‌రెడ్డితో కలిసి ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రదర్శనగా ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలసి నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం పాత పురపాలక కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్యేలు ఎన్‌.ప్రసన్న కుమార్‌రెడ్డి, ఎం.మహీధర్‌రెడ్డి, కె.సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని