AP News: చంద్రబాబు నాకు రాజకీయ భిక్ష పెట్టలేదు
నాకు రాజకీయ భిక్ష పెట్టానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తప్పని సభాపతి తమ్మినేని సీతారాం వివరణ ఇచ్చారు. ‘మీకు రాజకీయ భిక్ష నేనే పెట్టానని ప్రతిపక్ష నేత ఆవేశంలో అచ్చుతప్పు ప్రకటన చేశారు.
శాసనసభాపతి తమ్మినేని సీతారాం
ఈనాడు, అమరావతి: నాకు రాజకీయ భిక్ష పెట్టానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తప్పని సభాపతి తమ్మినేని సీతారాం వివరణ ఇచ్చారు. ‘మీకు రాజకీయ భిక్ష నేనే పెట్టానని ప్రతిపక్ష నేత ఆవేశంలో అచ్చుతప్పు ప్రకటన చేశారు. అది తప్పు. తెలుగుదేశంలోకి రాక ముందే నేను కాంగ్రెస్లో ఉన్నా. నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించి, రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు. చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టిందీ ఆయనే. తర్వాత నేను రాజకీయ పరమైన విభేదాలతో బయటకు వచ్చాక జగన్మోహన్రెడ్డి ములాఖత్కు రమ్మని కబురు పెట్టారు. పిలిచి మాట్లాడాక ఏం చేయమంటారని అడిగితే విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరమనడంతో అలాగే చేశాను. నా రాజకీయ జీవితానికి పునఃభిక్ష పెట్టింది జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే’ అని వివరించారు. ‘సభాపతి స్థానంలో ఉన్న నన్ను అధిక్షేపిస్తూ మాట్లాడారు. ఇక్కడ నుంచే వివరణ ఇవ్వాల్సి ఉంది. మీతోపాటు నేను(ఎన్టీఆర్కు) చేసిన అన్యాయానికి శాసనసభ వేదికపై నుంచే స్పీకర్గా నా పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచా. ఆయనకు అదీ లేదు. మూడుసార్లు సీఎంగా చేసిన వ్యక్తి హుందాగా ఉంటే బాగుంటుందనేది నా అభిప్రాయం’ అని పేర్కొన్నారు.
సభలో నినాదాలు...: మంత్రి కన్నబాబు మాట్లాడుతున్న సమయంలో ‘‘బాబాయి.. గొడ్డలి’’ అంటూ తెదేపా వారు నినాదాలు చేయగా.. ప్రతిగా ‘పార్టీ లేదు.. బొక్కా లేదు’’ అంటూ వైకాపా సభ్యులు నినాదాలు చేశారు. దీంతో కొంత సమయంపాటు గందరగోళం ఏర్పడింది.
మాధవరెడ్డి హత్య చేయబడ్డారనే నేను అన్నా: - అంబటి రాంబాబు, ఎమ్మెల్యే, వైకాపా
మాధవరెడ్డి హత్య చేయబడ్డారని నేను అన్నాను... అందులో చంద్రబాబు హస్తం ఉందనే ఆరోపణలున్నాయి. దానిపై మాట్లాడదామంటే ఆవేశపడిపోయి నేరుగా నాతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇది దురదృష్టకరమైన పరిణామం. నేను మాధవరెడ్డి అనగానే ఎందుకో చాలా ఆవేశపడిపోయారు. జగన్, ఆయన కుటుంబాన్ని విమర్శించేలా చంద్రబాబే మాట్లాడారు. సభాధ్యక్షుడ్ని రెచ్చగొట్టేలా మీకు రాజకీయ భిక్ష పెట్టామని మాట్లాడారు.
బాబును ప్రజలు నమ్మరు: మంత్రి బొత్స
శాసనసభలో ఎవరి భార్య గురించి ఎవరు మాట్లాడారు? రికార్డులు చూడండి... చంద్రబాబే తనను తాను విమర్శించుకున్నారు. మేం సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లం.. ఆయనలా మామను వెన్నుపోటు పొడిచిన వాళ్లం కాదు. ఆయన్ను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఆయనకు ప్రజలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలేవీ అవసరం లేవు. వ్యక్తిగత సమస్యలను తెచ్చి.. ఎదుటివాళ్లను కించపరుస్తూ ఎత్తి పొడుస్తూ.. సభ జరగకుండా ప్రయత్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్