కృష్ణపట్నంలో కరోనా

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నంలో వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదివారం నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షల్లో 2 కరోనా పాజిటివ్‌

Updated : 31 May 2021 15:16 IST

కృష్ణపట్నం (ముత్తుకూరు), న్యూస్‌టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నంలో ఐదు పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. వైద్యారోగ్య శాఖ అధికారులు ఆదివారం నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షల్లో 2 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా.. సోమవారం మరో ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు స్థానిక వైద్యాధికారిణి ప్రవల్లిక తెలిపారు. మరో 20 మందికిపైగా స్వల్ప లక్షణాలున్నట్లు గుర్తించి, ఆర్టీపీసీఆర్‌ నిమిత్తం నమూనాలను జిల్లా కేంద్రానికి పంపినట్లు వివరించారు. రెండు రోజులపాటు గ్రామంలో పరీక్షలు చేస్తామని ఆమె చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని