ప్రభుత్వం స్పందించకుంటే నిర్ణయం ప్రకటిస్తా: ఆనందయ్య
మందు తయారీ, పంపిణీకి సహకారం కావాలని కోరగా రాష్ట్రప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదని కృష్ణపట్నం ఆనందయ్య వెల్లడించారు. మందును బాధితుల ఇళ్లకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ సహకారం కావాలని సీఎంకు
ఈనాడు డిజిటల్, నెల్లూరు: మందు తయారీ, పంపిణీకి సహకారం కావాలని కోరగా రాష్ట్రప్రభుత్వం నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన లేదని కృష్ణపట్నం ఆనందయ్య వెల్లడించారు. మందును బాధితుల ఇళ్లకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వ సహకారం కావాలని సీఎంకు ఇటీవల లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం ఇంతవరకూ నిర్ణయం ప్రకటించలేదని బుధవారం ఆయన ‘ఈనాడు’కు తెలిపారు. గురువారం సాయంత్రానికి ప్రభుత్వం స్పందించకుంటే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఎలా పంపాలనే విషయాన్ని తమ బృందంతో గురువారం చర్చిస్తానన్నారు. ట్రస్టు ద్వారా ప్రజలకు పంపిణీ చేసే ఆలోచన చేస్తామన్నారు. ప్రస్తుతం కృష్ణపట్నంలో మందు తయారు చేస్తున్నామన్నారు. తమ గ్రామంలో అందరికీ ఇప్పటికే పంపిణీ చేశామని, సర్వేపల్లి నియోజకవర్గంలోనూ కొన్ని ప్రాంతాల్లో పంపిణీ జరుగుతుందని తెలిపారు. 50 వేల మంది పాజిటివ్ వ్యక్తులకు ఇచ్చేందుకు మందు సిద్ధంగా ఉందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్