మాజీ ఎమ్మెల్యే వెంకయ్య కన్నుమూత

స్వాతంత్య్ర సమరయోధుడు, గుంటూరు జిల్లా తాడికొండ మాజీ శాసన సభ్యుడు, ప్రముఖ వైద్యుడు తిరువాయిపాటి వెంకయ్య(92) గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో గురువారం

Published : 20 Aug 2021 05:24 IST

పొన్నూరు, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర సమరయోధుడు, గుంటూరు జిల్లా తాడికొండ మాజీ శాసన సభ్యుడు, ప్రముఖ వైద్యుడు తిరువాయిపాటి వెంకయ్య(92) గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో గురువారం కన్నుమూశారు. ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా శిష్యుడిగా, ఆయనతో కలిసి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. పొన్నూరు సమితి అధ్యక్షుడిగా, పొన్నూరు పురపాలక సంఘ ఛైర్మన్‌గా, 1989 నుంచి 94 వరకు శాసన సభ్యునిగా పని చేశారు. 1991 నుంచి 94 వరకు ‘ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ ఛైర్మన్‌గా పని చేసి రాష్ట్రంలో అనేక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించడంలో క్రియాశీల పాత్ర పోషించారు. ఏఐసీసీ సభ్యుడిగా కొనసాగడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా సుదీర్ఘకాలం సేవలందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని