అనాలోచిత నిర్ణయాలతో విద్యారంగం అంధకారం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో విద్యారంగంలో అంధకారం నెలకొందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. భారత విద్యార్థి

Published : 29 Nov 2021 03:56 IST

ఎస్‌ఎఫ్‌ఐ మహా సభల్లో ఎమ్మెల్సీ విఠపు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాలతో విద్యారంగంలో అంధకారం నెలకొందని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ) 23వ రాష్ట్ర మహాసభలు ఆదివారం విజయనగరంలోని ఆనందగజపతి ఆడిటోరియంలో ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న సభలకు ప్రారంభ సూచికగా రాష్ట్ర అధ్యక్షుడు కె.ప్రసన్నకుమార్‌ ఎస్‌ఎఫ్‌ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యావ్యతిరేక విధానాలపై పెద్దఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు చేపట్టాలన్నారు. నూతన జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ) అమలు చేయడంలో ముందుండాలని వైకాపా ప్రభుత్వం ఉత్సుకత చూపుతోందని విమర్శించారు. రహస్య ఒప్పందాలతో ప్రాథమిక పాఠశాలలను మూసివేసేందుకు నిర్ణయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని