బిల్లులు చెల్లించాలని గుత్తేదారుల నిరసన

తాము చేసిన పనుల బిల్లులు చెల్లించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో గుత్తేదారులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా బిల్లులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నామంటూ

Published : 02 Dec 2021 04:22 IST

మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటుచేసిన గుత్తేదారులు

తాము చేసిన పనుల బిల్లులు చెల్లించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో గుత్తేదారులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా బిల్లులు ఇవ్వకపోవడంతో ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడుతున్నామంటూ మున్సిపల్‌ కార్యాలయం బయట, లోపల ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. ‘మేము పిఠాపురం కాంట్రాక్టర్లం. మా బిల్లులు చెల్లించి, మా ప్రాణాలు కాపాడండి’ అంటూ వాటిలో పేర్కొన్నారు. తమ గోడు చెబుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదన్నారు. సూరవరపు దివాణం, తదితరులు పాల్గొన్నారు.

- న్యూస్‌టుడే, పిఠాపురం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని