నిధులు వెనక్కి ఇవ్వాలని సర్పంచుల ఆందోళన
గ్రామ పంచాయతీల అనుమతి తీసుకోకుండా విద్యుత్తుఛార్జీలు, బకాయిల కింద సర్దుబాటు చేసిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రప్రభుత్వం వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలు జిల్లాల్లో సర్పంచులు మండల పరిషత్
ఉయ్యూరులో సర్పంచులతో కలిసి ధర్నా చేస్తున్న రాజేంద్రప్రసాద్
ఈనాడు, అమరావతి: గ్రామ పంచాయతీల అనుమతి తీసుకోకుండా విద్యుత్తుఛార్జీలు, బకాయిల కింద సర్దుబాటు చేసిన ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రప్రభుత్వం వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలు జిల్లాల్లో సర్పంచులు మండల పరిషత్ కార్యాలయాల ఎదుట బుధవారం ఆందోళనలు చేపట్టి అధికారులకు వినతులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ పిలుపుతో మండల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా ఉయ్యూరులో మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. నిధులు జమచేయకపోతే హైకోర్టులో కేసులు వేస్తామని ఆయన అన్నారు. అనంతరం పలువురు సర్పంచులతో కలిసి ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?