వారిని తరిమేయండి..
‘కొంతమంది వీఆర్వోలు సమావేశాన్ని బహిష్కరించారు.. వారి సేవలు నియోజకవర్గానికి అవసం లేదు.. సచివాలయాలకు హాజరైతే ఆయా పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచులు వారిని బయటకు తరిమేయండి..’ అంటూ...
వీఆర్వోలపై మంత్రి అప్పలరాజు ఆగ్రహం
మంత్రి అప్పలరాజు కారు ఎదుట ఆందోళన చేస్తున్న వీఆర్వోలు
కాశీబుగ్గ, న్యూస్టుడే: ‘కొంతమంది వీఆర్వోలు సమావేశాన్ని బహిష్కరించారు.. వారి సేవలు నియోజకవర్గానికి అవసం లేదు.. సచివాలయాలకు హాజరైతే ఆయా పరిధిలోని ఎంపీటీసీలు, సర్పంచులు వారిని బయటకు తరిమేయండి..’ అంటూ కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్కర్ సమక్షంలో రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గలో బుధవారం గృహనిర్మాణ శాఖ(ఓటీఎస్)కు సంబంధించి మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇది ప్రారంభానికి ముందే పలాస పురపాలక సంఘ కమిషనర్ రాజగోపాల్ వీఆర్వోలను బయటకు వెళ్లిపోవాలన్నారు. దాంతో అవసరం లేకపోతే ఎందుకు పిలిచారని, కమిషనర్ తమను అవమానించారంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. అదే సమయానికి మంత్రి అప్పలరాజు కాన్వాయ్ రావడంతో దానిని అడ్డుకొని కమిషనర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి కారు దిగి ఆందోళన చేస్తున్న వారందరికీ షోకాజ్ నోటీసులివ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ మంత్రి అప్పలరాజు పై విధంగా వ్యాఖ్యలు చేశారు. వీఆర్వోల సంఘం నాయకుడు కె.శ్రావణ్కుమార్ మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో కమిషనర్ వీఆర్వో వ్యవస్థను హీనంగా మాట్లాడటం తగదన్నారు. మమ్మల్ని అగౌరవపరిచినందునే మంత్రి, కలెక్టర్కు విన్నవించుకునేందుకు ప్రయత్నించామని చెప్పారు.
మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాల్సిందే
ఈనాడు డిజిటల్, అమరావతి: వీఆర్వోల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పశుసంవర్ధకశాఖ మంత్రి అప్పలరాజు, శ్రీకాకుళం మునిసిపల్ కమిషనర్ క్షమాపణ చెప్పాలని గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రరాజు, ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. లేదంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం నల్లబ్యాడ్జీలతో వీఆర్వోలందరూ విధులకు హాజరుకావాలని నిర్ణయించామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్