ఉద్యోగుల ఉద్యమ శంఖారావం బెజవాడ నుంచే: ఏపీ ఐకాస
ఉద్యోగుల ఉద్యమ శంఖారావాన్ని బెజవాడ నుంచే మొదలు పెడతామని అని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రకటించారు.
ఈనాడు, అమరావతి: ఉద్యోగుల ఉద్యమ శంఖారావాన్ని బెజవాడ నుంచే మొదలు పెడతామని అని ఏపీ ఐకాస ఛైర్మన్ బండి శ్రీనివాసరావు ప్రకటించారు. ఏపీ ఎన్జీవో కార్యాలయంలో శనివారం ఏపీ ఐకాస, ఐకాస అమరావతి సంయుక్త కార్యాచరణలో భాగంగా పశ్చిమ కృష్ణా జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ఉద్యోగులపై ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి కారణంగా మనోభావాలు దెబ్బతిన్నాయి. పీఆర్సీ నివేదికను బయట పెట్టకుండానే పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామనడం విడ్డూరంగా ఉంది. ఉద్యోగ ఐకాస ఐక్య వేదిక ద్వారా ఉద్యమ కార్యాచరణ పోరుబాట తొలి అడుగుగా బెజవాడ నుంచి మొదలు పెడతాం. అన్ని జిల్లాలకు తిరిగి ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి తీసుకువెళ్తాం’’ అని తెలిపారు. సమావేశంలో ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, రవాణా ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఎం.రాజుబాబు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం