హైదరాబాద్‌లో ఈఎస్‌ఐ సభ్యులకు వార్షిక వైద్య పరీక్షలు

కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) తన సభ్యులకు వార్షిక వైద్య పరీక్షలను శనివారం ప్రారంభించింది. హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్‌, ఫరీదాబాద్‌, కోల్‌కతాల్లోని....

Published : 05 Dec 2021 05:28 IST

దిల్లీ: కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) తన సభ్యులకు వార్షిక వైద్య పరీక్షలను శనివారం ప్రారంభించింది. హైదరాబాద్‌తో పాటు అహ్మదాబాద్‌, ఫరీదాబాద్‌, కోల్‌కతాల్లోని ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. బీమా పొంది, 40 ఏళ్లు, ఆపై వయసు గల సభ్యులకు ఉచితంగా ఈ సేవలను అందిస్తున్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని