నీతి నిజాయతీల్లో ఆదర్శప్రాయుడు రోశయ్య

‘మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. జనసేన పార్టీ స్థాపించాక నాకు ఎన్నో విలువైన సలహాలు అందించి ఎంతో అభిమానం చూపారు.

Published : 05 Dec 2021 05:23 IST

‘మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. జనసేన పార్టీ స్థాపించాక నాకు ఎన్నో విలువైన సలహాలు అందించి ఎంతో అభిమానం చూపారు. ఆయనలోని విధేయతే ఆయన్ను ముఖ్యమంత్రిగా నిలిపింది. వేలెత్తి చూపలేని పాలన ఆయన సొంతం. నీతి నిజాయతీలతో రాజకీయ ప్రస్థానాన్ని ముగించిన రోశయ్య ఆదర్శప్రాయులు.’

- వపన్‌కల్యాణ్‌, జనసేన పార్టీ అధ్యక్షుడు


పెద్ద దిక్కును కోల్పోయాం

‘రోశయ్య మృతితో కాంగ్రెస్‌పార్టీ పెద్ద దిక్కును కోల్పోయింది. కాంగ్రెస్‌ పార్టీ పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు రోశయ్య. ఆయన జీవితాంతం గౌరవప్రదమైన రాజకీయాలు చేశారు. మా పార్టీ నేతలకు ఎన్నో విలువైన సూచనలు అందజేశారు.’

- శైలజానాథ్‌, ఏపీసీసీ అధ్యక్షుడు


అత్యుత్తమ సేవలు అందించారు

‘రాష్ట్ర రాజకీయాల్లో రోశయ్య నిర్వర్తించిన పాత్ర వర్ణనాతీతం.అత్యుత్తమ సేవలు అందించారు.’

- భాజపా ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని