
ఏపీ పిటిషన్ను రద్దు చేయండి
డిండి ఎత్తిపోతలపై ఎన్జీటీలో తెలంగాణ కౌంటర్
ఈనాడు హైదరాబాద్: డిండి ఎత్తిపోతల పథకంలో ప్రస్తుతం చేపట్టిన పనులు తాగు, పారిశ్రామిక అవసరాల కోసమేనని తెలంగాణ ప్రభుత్వం జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) దృష్టికి తెచ్చింది. కరవుపీడిత, ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయడం ప్రధానమని పేర్కొంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన వీరాంజనేయ రిజర్వాయర్ వెనకభాగం నుంచి రోజుకు అర టీఎంసీ చొప్పున 30 టీఎంసీల వరద నీటిని మళ్లించేలా ఈ పథకాన్ని చేపట్టినట్లు తెలిపింది. భవిష్యత్తులో సాగునీటి అవసరాలూ ఉన్నాయని తెలిపింది. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేయాలని కోరింది. పర్యావరణ అనుమతులు లేకుండా తెలంగాణ డిండి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిందంటూ ఆంధ్రప్రదేశ్ ఎన్జీటీని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.