గుంటూరులో సక్కు గ్రూపుపై ఐటీ దాడులు

స్పిన్నింగ్‌, హేచరీస్‌ వ్యాపారాల నిర్వహణలో గుంటూరులో ప్రసిద్ధిగాంచిన సక్కు గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలపై మంగళవారం ఐటీ దాడులు జరిగాయి.

Published : 08 Dec 2021 04:29 IST

ఈనాడు, అమరావతి: స్పిన్నింగ్‌, హేచరీస్‌ వ్యాపారాల నిర్వహణలో గుంటూరులో ప్రసిద్ధిగాంచిన సక్కు గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలపై మంగళవారం ఐటీ దాడులు జరిగాయి. విశాఖపట్నం నుంచి డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఇన్‌కంటాక్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు నగరంలో వారికి చెందిన వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, ఇళ్లల్లో సోదాలు చేశారు. వార్షిక రిటర్నులు, పన్ను చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలతో పాటు పలు రికార్డులను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని