పాఠశాలకు కుళ్లిన గుడ్లు సరఫరా
ప్రభుత్వ పాఠశాలకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేయడంతో మధ్యాహ్న భోజనం తయారు చేసే నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలకు సరఫరా చేసిన కోడిగుడ్లు
తాళ్లరేవు, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేయడంతో మధ్యాహ్న భోజనం తయారు చేసే నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు జడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్నం 427 గుడ్లు సరఫరా చేశారు. అందులో 68 గుడ్లు పాడైనట్లు గుర్తించి, మిగతా వాటిని ఉడకబెట్టారు. అందులోనూ చాలా వరకు కుళ్లినట్లు పెంకు తీసే క్రమంలో గుర్తించారు. సోమవారం సరఫరా చేసిన వాటిలో ఏకంగా 510 గుడ్లు పాడైపోయినట్లు పాఠశాలలో వంట చేసే మహిళలు తెలిపారు. దీంతో సగం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయకుండా ఇంటికి వెళ్తున్నారన్నారు. మంగళవారం 771 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరైతే 427 మందే భోజనం చేశారని వివరించారు.
గుడ్డు లోపల కుళ్లిపోయి ఇలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203