వారం రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తారు
సీఎం జగన్ వారం రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్.చంద్రశేఖర్రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దీని అమలుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, ప్రస్తుతం ఆ ప్రక్రియ నడుస్తోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్.చంద్రశేఖర్రెడ్డి
ఈనాడు, అమరావతి: సీఎం జగన్ వారం రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సలహాదారు ఎన్.చంద్రశేఖర్రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దీని అమలుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారని, ప్రస్తుతం ఆ ప్రక్రియ నడుస్తోందని తెలిపారు. పీఆర్సీ అమలు చేశాక డీఏలు ఇవ్వడానికీ ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఉద్యోగ సంఘాలు చెబుతున్న 71 అంశాల్లో పీఆర్సీ, డీఏలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సమస్యలే కీలకమైనవి. మిగతావన్నీ చిన్న అంశాలే. సీపీఎస్ ఉద్యోగులకు పాత పింఛను విధానంలో ఉండే ప్రయోజనాలు వర్తించేలా ఎలా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో తెలంగాణలో న్యాయస్థానాల నుంచి అడ్డంకులు వచ్చాయి. ఇక్కడ న్యాయ అవరోధాలు లేకుండా ఆ ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని చెప్పారు. వారం, పదిరోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చెప్పినా ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయని, ఈ విషయంలో సంయమనం పాటించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్