వండేవారు లేక...ఆకలికి తాళలేక
అనంతపురం జిల్లా లేపాక్షి జ్యోతిబా ఫులే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులే వంట వండుకుని తినాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక్కడ ఒప్పంద పద్ధతిన పని చేసే వంట, బోధనేతర సిబ్బందికి 4 నెలలుగా వేతనాలు అందలేదు.
కూరగాయలు తరుగుతున్న విద్యార్థులు
లేపాక్షి, న్యూస్టుడే: అనంతపురం జిల్లా లేపాక్షి జ్యోతిబా ఫులే బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులే వంట వండుకుని తినాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక్కడ ఒప్పంద పద్ధతిన పని చేసే వంట, బోధనేతర సిబ్బందికి 4 నెలలుగా వేతనాలు అందలేదు. వారంతా మంగళవారం సమ్మెబాట పట్టారు. పాఠశాల, కళాశాలలో 1,140 మంది విద్యార్థులు, 75 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వంట సిబ్బంది సమ్మెకు దిగడంతో ఉపాధ్యాయులు విద్యార్థులతో కూరగాయలు తరిగించి, వంట చేయించారు. గురువులే దగ్గరుండి వంట పనులు చేయించడంపై టీన్ఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ ప్రతినిధులు ప్రిన్సిపల్ను నిలదీశారు. సమ్మెకు దిగినవారు బుధవారం నుంచి విధులకు హాజరయ్యేలా ఏజెన్సీ నిర్వాహకుడితో మాట్లాడినట్లు ప్రిన్సిపల్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!