Special Trains:సంక్రాంతికి 14 ప్రత్యేక రైళ్లు: ద.మ.రైల్వే

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సంక్రాంతి పండుగకు లింగంపల్లి-కాకినాడ మధ్య 14 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 3 నుంచి 18 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. కాకినాడ నుంచి లింగంపల్లికి ఏడు, లింగంపల్లి నుంచి

Updated : 31 Dec 2021 08:57 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సంక్రాంతి పండుగకు లింగంపల్లి-కాకినాడ మధ్య 14 ప్రత్యేక రైలు సర్వీసులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. జనవరి 3 నుంచి 18 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. కాకినాడ నుంచి లింగంపల్లికి ఏడు, లింగంపల్లి నుంచి కాకినాడకు ఏడు ట్రిప్పులు నడుస్తాయని జోన్‌ సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. సికింద్రాబాద్‌ నుంచి ఒడిశాలోని బరంపురం స్టేషన్‌కు 9న, తిరిగి బరంపురం నుంచి సికింద్రాబాద్‌కు 10న రెండు ప్రత్యేక ట్రిప్పులు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని