పంటలు పాడైనా... దిగుబడులు బాగున్నాయంటారా?
ఖరీఫ్లో అధిక వర్షాలు, వరదలు, వైరస్, తామర పురుగుల కారణంగా అన్ని పంటలు దెబ్బతిని 80% మేర దిగుబడులు తగ్గిపోతే... అధిక దిగుబడులు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు
వ్యవసాయ మంత్రి కన్నబాబుపై ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ధ్వజం
ఈనాడు, అమరావతి: ఖరీఫ్లో అధిక వర్షాలు, వరదలు, వైరస్, తామర పురుగుల కారణంగా అన్ని పంటలు దెబ్బతిని 80% మేర దిగుబడులు తగ్గిపోతే... అధిక దిగుబడులు వచ్చాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రకటించడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య విమర్శించారు. మంత్రి మాటల్ని కౌలు రైతుల సంఘం తీవ్రంగా ఖండిస్తోందని, ఆయన వాస్తవాలను చెప్పాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ‘ధాన్యం దిగుబడి ఈ ఏడాది ఎకరాకు 15 బస్తాలు మించి రావడం లేదు. వచ్చిన కొద్దిపాటి పంటను రైతు భరోసా కేంద్రాల్లో కొనడం లేదు. మిల్లర్ల దోపిడీ పెరిగింది. పత్తి ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లే వచ్చింది. మిరప ఏకంగా 85% దెబ్బతిందని రైతులే చెబుతున్నారు’ అని వివరించారు.
‘ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోనే ఆత్మహత్యలు’
‘వరి దెబ్బతినడంతో తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తంలో కౌలు రైతు గుండెపోటుతో మరణించారు. చెరకు బకాయిలు అందడం లేదని తుని మండలం సుభద్రయ్యపేటకు చెందిన మరో కౌలు రైతు చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయి’ అని జమలయ్య ధ్వజమెత్తారు. ‘కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతుభరోసా ఇవ్వలేదు. పంటరుణాల్లేవు. కనీసం దిగుబడులను అమ్ముకునే పరిస్థితి కల్పించడం లేదు. ఇప్పటికైనా కౌలు రైతుల సమస్యలపై దృష్టి సారించండి’ అని విన్నవించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్