‘సైనిక’ పిల్లల సాహసం!

విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్‌స్కూల్‌ వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్‌, కర్నల్‌ అరుణ్‌ కులకర్ణి జ్యోతి వెలిగించి పాఠశాల ఆవరణలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Published : 19 Jan 2022 04:47 IST

ఆకట్టుకున్న విన్యాసాలు  
ఘనంగా సైనిక్‌ స్కూల్‌ వజ్రోత్సవాలు

విజయనగరం గ్రామీణం, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్‌స్కూల్‌ వజ్రోత్సవాల సందర్భంగా విద్యార్థుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపల్‌, కర్నల్‌ అరుణ్‌ కులకర్ణి జ్యోతి వెలిగించి పాఠశాల ఆవరణలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక్కడ చదివినవారంతా దేశవిదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం సైనిక్‌ స్కూల్‌పై రూపొందించిన పోస్టల్‌ కవర్‌ను విడుదల చేశారు. పూర్వ విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా వేడుకలను వీక్షించారు. సహాయ ప్రిన్సిపల్‌ వింగ్‌ కమాండర్‌ ఎస్‌.కేశవన్‌, పరిపాలనాధికారి లెఫ్టినెంట్‌ కమాండర్‌ అభిలాష్‌ బాలచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని