నాడు-నేడుకు పోకర్ణ గ్రూప్‌ రూ.కోటి విరాళం

రాష్ట్రంలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పోకర్ణ గ్రూప్‌ రూ.కోటి విరాళం అందజేసింది. ఆ సంస్థ సీఈఓ గౌతమ్‌చంద్‌ జైన్‌ మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌కు చెక్కు అందజేశారు.

Published : 19 Jan 2022 04:47 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పోకర్ణ గ్రూప్‌ రూ.కోటి విరాళం అందజేసింది. ఆ సంస్థ సీఈఓ గౌతమ్‌చంద్‌ జైన్‌ మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌కు చెక్కు అందజేశారు. పోకర్ణ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ఈ నిధులను అందజేసింది. ఈ కార్యక్రమంలో కనెక్ట్‌ టు ఆంధ్ర విభాగం సీఈవో వి.కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు