ఇంజినీరింగ్‌ స్పాట్‌ ప్రవేశాలకు 21న ప్రకటన

ఈఏపీసెట్‌ ఎంపీసీ స్ట్రీమ్‌ స్పాట్‌ ప్రవేశాలకు శుక్రవారం ప్రకటన విడుదల చేయనున్నారు. మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయినందున కళాశాలల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసుకునేందుకు యాజమాన్యాలకు అవకాశం కల్పించనున్నారు.

Published : 20 Jan 2022 05:14 IST

ఈనాడు, అమరావతి: ఈఏపీసెట్‌ ఎంపీసీ స్ట్రీమ్‌ స్పాట్‌ ప్రవేశాలకు శుక్రవారం ప్రకటన విడుదల చేయనున్నారు. మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయినందున కళాశాలల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసుకునేందుకు యాజమాన్యాలకు అవకాశం కల్పించనున్నారు. ఇంజినీరింగ్‌, ఫార్మసీ కోర్సుల్లో 31,605 సీట్లు మిగిలిపోగా.. ఒక్క ఇంజినీరింగ్‌లోనే 25,677 సీట్లు మిగిలాయి.

పదోతరగతి పరీక్ష ఫీజుల చెల్లింపు 24నుంచి

పదోతరగతి విద్యార్థులు ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 4వరకు ప్రధానోపాధ్యాయులకు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అపరాధ రుసుము రూ.50తో ఫిబ్రవరి 8, రూ.200తో 14వ తేదీ, రూ.500తో 16వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని