కలెక్టరేట్ల ఎదుట పుర కార్మికుల ధర్నా
ఉద్యోగాలను క్రమబద్ధీకరించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న పీఆర్సీ తమకూ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ పుర, నగరపాలక సంస్థల్లోని పొరుగు సేవల కార్మికులు
పీఆర్సీ వర్తింపజేయాలని డిమాండ్
ఈనాడు-అమరావతి - గవర్నర్పేట (విజయవాడ), న్యూస్టుడే: ఉద్యోగాలను క్రమబద్ధీకరించి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తున్న పీఆర్సీ తమకూ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ పుర, నగరపాలక సంస్థల్లోని పొరుగు సేవల కార్మికులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్, ఆర్టీవో, పురపాలక కార్యాలయాల ఎదుట ధర్నా చేశారు. ప్రజారోగ్యం, ఇంజినీరింగ్ విభాగాల్లో పని చేస్తున్న కార్మికులు, పుర పాఠశాలల్లో సేవలు అందిస్తున్న స్వీపర్లు పాల్గొన్నారు. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ పురపాలక కార్మికులు, ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. విశాఖపట్నం, అనంతపురం కలెక్టరేట్ల ఎదుట నిర్వహించిన ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, కార్యదర్శి నాగభూషణం పాల్గొని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. పొరుగు సేవల కార్మికులను క్రమబద్ధీరించి సీఎం జగన్.. ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఆయా నేతలు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అందించాలని, కార్మికుల కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, 27% మధ్యంతర భృతి, కరవు భత్యం, ఇంటి అద్దెలు వర్తింపజేయాలని సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు ప్రభుత్వానికి సూచించారు. కార్మికుల సమస్యలను తీర్చకపోతే రాబోయే రోజుల్లో నిరసనలు తీవ్రతరం చేస్తామని, అవసరమైతే సమ్మెకు వెళ్లేందుకు కూడా వెనుకాడమని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలతో పాటు ఆర్డీవో, పురపాలక కార్యాలయాల ఎదుట కార్మికులు ధర్నాలు చేసి అధికారులకు వినతులు ఇచ్చారు. అనంతపురం జిల్లాలో కార్మిక సంఘ నాయకులు పలువుర్ని పోలీసులు బుధవారం ఉదయం అదుపులోకి తీసుకొని ధర్నా ముగిశాక విడిచిపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్