ఎమ్మెల్యే కాటసానిపైపత్రిక ప్రకటన ఉత్తర్వులు వెనక్కి..

పత్రికల్లో ప్రకటన ద్వారా కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి నోటీసు జారీ చేయాలంటూ ఈనెల 4న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు వెనక్కి తీసుకుంది. గతంలో ఆదేశించిన ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం

Published : 21 Jan 2022 05:51 IST

ఈనాడు, అమరావతి: పత్రికల్లో ప్రకటన ద్వారా కర్నూలు జిల్లా పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి నోటీసు జారీ చేయాలంటూ ఈనెల 4న ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు వెనక్కి తీసుకుంది. గతంలో ఆదేశించిన ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు అల్లూరి మల్లేశ్వరీ, ఎం.ఎన్‌ శశిధర్‌లకు పత్రికల్లో ప్రకటన ద్వారా నోటీసులు జారీ చేయాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కేసు విచారణను ఫిబ్రవరి ఏడో తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని