జీతం తగ్గుతుందనుకోవద్దు
‘మీ లెక్కలతో జీతం తగ్గుతుందన్న ఆలోచనలు చేయవద్దు. ప్రభుత్వం ప్రకటించిన వాటన్నింటినీ కలిపితే జీతం పెరుగుతుందనేదే కనిపిస్తోంది’ అని ఉద్యోగులనుద్దేశించి ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఆందోళన చెందుతున్న హెచ్ఆర్ఏపై
ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనుకునే వారి ఉచ్చులో పడొద్దు: చీఫ్విప్ శ్రీకాంత్రెడ్డి
ఈనాడు, అమరావతి: ‘మీ లెక్కలతో జీతం తగ్గుతుందన్న ఆలోచనలు చేయవద్దు. ప్రభుత్వం ప్రకటించిన వాటన్నింటినీ కలిపితే జీతం పెరుగుతుందనేదే కనిపిస్తోంది’ అని ఉద్యోగులనుద్దేశించి ప్రభుత్వ చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఆందోళన చెందుతున్న హెచ్ఆర్ఏపై కూడా ప్రభుత్వం ఉద్యోగులతో కచ్చితంగా చర్చిస్తుందని, ఏకపక్షంగా వెళ్లబోదని పేర్కొన్నారు. ‘అధికారంలోకొచ్చిన వెంటనే 27శాతం ఐఆర్ను ఇచ్చిన ప్రభుత్వమిది. దీనివల్ల రూ.18వేల కోట్ల భారం పడింది. అప్పట్లో 2, 3 శాతం ఐఆర్ ఇచ్చినా మీరు అడిగేవారు కాదు కదా? మీకా రూ.18వేల కోట్లు ఎందుకివ్వాలని ప్రభుత్వమే అనుకొని ఉంటే అదే డబ్బుతో అప్పటికే పెండింగులో ఉన్న చిన్నకాంట్రాక్టుల బిల్లులను చెల్లించుకునేది కదా?’ అని వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. కరోనా కష్టకాలంలో రూ.10వేల కోట్ల భారం పడుతున్నా ఉద్యోగులకు మంచి చేయాలని ముఖ్యమంత్రి పీఆర్సీ ప్రకటించారు. ఇలాంటి ప్రభుత్వం గురించి ఉద్యోగులు కూడా ఆలోచించాలి. చంద్రబాబు, ఆయన సంబంధితులు గతంలో మిమ్మల్ని ద్వేషించినవారు కాదా? వారు ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా వ్యవహరిస్తున్నారు. వారి ఉచ్చులో పడవద్దు. రాజకీయ పార్టీల్లాగా ఏకపక్షంగా ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉద్యోగులు మాట్లాడడం సమంజసం కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలనే ప్రభుత్వం కోరుతోంది తప్ప ఉద్యోగులకు నష్టం చేయాలనే భావన లేదు. ఏకపక్షంగా వెళ్లడమనేది ఎవరికీ మంచిది కాదు’ అని వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?