వామపక్ష తీవ్రవాద బాధితులకు ఏం చేశారు
వామపక్ష తీవ్రవాదం కారణంగా నిర్వాసితులైన గిరిజన కుటుంబాల గుర్తింపు, పునరావాసానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు గిరిజనుల జాతీయ కమిషన్ (ఎన్సీఎస్టీ) తాజాగా
గుర్తింపు, పునరావాసంపై నివేదిక ఇవ్వండి
తెలుగు రాష్ట్రాలకు ఎన్సీఎస్టీ నోటీసులు
దిల్లీ: వామపక్ష తీవ్రవాదం కారణంగా నిర్వాసితులైన గిరిజన కుటుంబాల గుర్తింపు, పునరావాసానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు గిరిజనుల జాతీయ కమిషన్ (ఎన్సీఎస్టీ) తాజాగా నోటీసులిచ్చింది. ఇదే విషయమై సర్వే నిర్వహించాలని 2019లోనే తెలుగు రాష్ట్రాలను ఎన్సీఎస్టీ, కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు కోరాయి కొవిడ్ కారణంగా ఈ సర్వే చేపట్టలేకపోతున్నామంటూ రెండు రాష్ట్రాలు చెబుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈనెల 12న మరోమారు నోటీసులిచ్చామని, 30 రోజుల్లోపు నివేదిక కోరామని ఎన్సీఎస్టీ అధికారి తెలిపారు. ఇవే నోటీసులను ఒడిశా, మహారాష్ట్ర, ఛŸత్తీస్గఢ్ రాష్ట్రాలకు కూడా ఇచ్చామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత