మత్స్యకారుల పరిహారం అక్రమాలపై కావలి ఎమ్మెల్యేకు నోటీసులు
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం చిప్పలేరు మత్స్యరేవు భూనిర్వాసితులకు పరిహారం అందజేయడంలో మోసాలకు పాల్పడ్డారంటూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డిపై హెచ్చార్సీలో మరో
కావలి, న్యూస్టుడే: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం చిప్పలేరు మత్స్యరేవు భూనిర్వాసితులకు పరిహారం అందజేయడంలో మోసాలకు పాల్పడ్డారంటూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్ రెడ్డిపై హెచ్చార్సీలో మరో కేసు నమోదైంది. నిర్వాసితులు 13 మందికి పరిహారంగా ప్రభుత్వం నుంచి రూ.2.6 కోట్లు మంజూరయ్యాయి. పరిహారాన్ని ఎమ్మెల్యే, ఆయన అనుచరగణం కాజేశారని ఏపీ తీరప్రాంత సంప్రదాయ మత్స్యకారుల పరిరక్షణ సమితి అధ్యక్షులు చిట్టిబాబు హెచ్చార్సీలో కేసు వేశారు. ఇందులో ఎమ్మెల్యే, ఆయన అనుచరులు సహా జిల్లా కలెక్టర్, కావలి ఆర్డీవోల ప్రమేయముందన్నారు. హెచ్చార్సీ నుంచి వారికి నోటీసులు జారీ అయ్యాయి. దీనిపై కావలి ఆర్డీవో శీనానాయక్‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ పరిహారంలో అక్రమాలు జరగలేదన్నారు. నిరూపణకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!