సాయుధ దళాల సిబ్బందికి ఆప్కో ప్రత్యేక రాయితీ
స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత వస్త్రాలకు ఉన్న ప్రాధాన్యత వెలకట్టలేనిదని, ఆనాడు ప్రతి నాయకుడు చేనేత వస్త్రాలను ధరించి జాతీయ భావాలను వెలిబుచ్చారని రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకులు బ్రిగేడియర్ వెంకటరెడ్డి
ఈనాడు డిజిటల్, అమరావతి: స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత వస్త్రాలకు ఉన్న ప్రాధాన్యత వెలకట్టలేనిదని, ఆనాడు ప్రతి నాయకుడు చేనేత వస్త్రాలను ధరించి జాతీయ భావాలను వెలిబుచ్చారని రాష్ట్ర సైనిక సంక్షేమశాఖ సంచాలకులు బ్రిగేడియర్ వెంకటరెడ్డి పేర్కొన్నారు. నేటితరం నాయకులు చేనేత వస్త్రాలను ధరించి యువతకు ప్రేరణగా నిలవాలన్నారు. సాయుధ దళాల సిబ్బందికి ఈ నెలాఖరు వరకు చేనేత వస్త్రాలపై 40 శాతం రాయితీని అందించడం శుభపరిణామమని చెప్పారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలను పురస్కరించుకుని విజయవాడలోని ఆప్కో మెగా షోరూమ్లో వేడుకలు నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు. స్వాతంత్య్ర సమర యోధులు రాంపిళ్ల నరసాయమ్మ, లగడపాటి చెంచయ్య, ఏలూరు రాములు, బండారు విమలమ్మను ఘనంగా సన్మానించారు. చేనేత వస్త్రాలపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆప్కో ఛైర్మన్ మోహన్రావు, ఎండీ నాగరాణి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!