సలహాదారులకు లక్షల్లో జీతాలు...
ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన సలహాదారులు, ఛైర్మన్లు, సలహా మండళ్లు, కార్పొరేషన్ల డైరెక్టర్లకు నెలకు లక్షల్లో జీతాలు ఇస్తూ... ఇంటి, కార్యాలయాల అద్దెలు, ఇతర సౌకర్యాలు కట్టబెడుతూ ఉద్యోగులకు మాత్రం
ఉద్యోగులకు మొండిచేయి
కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి
ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన సలహాదారులు, ఛైర్మన్లు, సలహా మండళ్లు, కార్పొరేషన్ల డైరెక్టర్లకు నెలకు లక్షల్లో జీతాలు ఇస్తూ... ఇంటి, కార్యాలయాల అద్దెలు, ఇతర సౌకర్యాలు కట్టబెడుతూ ఉద్యోగులకు మాత్రం మొండిచేయి చూపిస్తోందని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల్యాద్రి ధ్వజమెత్తారు. వీరందరికీ ఇచ్చే జీతాలు రాష్ట్ర బడ్జెట్ నుంచే కదా?..అప్పుడు గుర్తుకు రాలేదా విభజన కష్టాలు? అని ఆదివారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. న్యాయమైన వేతన సవరణ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఏకపక్ష జీవోలతో పీఆర్సీ అమలులో పెడ ధోరణిని ప్రదర్శించిందని మండిపడ్డారు. అశుతోష్మిశ్ర నివేదికను బయటపెట్టకుండానే చర్చల పేరుతో నాటకాలు ఆడిందని ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాబోయే ప్రధాని రాహుల్ గాంధీనే: సీఎం రేవంత్రెడ్డి
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్