ఆర్టీసీ ఉద్యోగ సంఘాల భేటీ నేడు

పీఆర్సీ సాధన సమితి చేస్తున్న ఉద్యమానికి మద్దతు, సమ్మెలో పాల్గొనడంపై చర్చించేందుకు ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాలన్నీ శుక్రవారం భేటీ కానున్నాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక పేరిట

Published : 28 Jan 2022 02:57 IST

ఈనాడు, అమరావతి: పీఆర్సీ సాధన సమితి చేస్తున్న ఉద్యమానికి మద్దతు, సమ్మెలో పాల్గొనడంపై చర్చించేందుకు ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాలన్నీ శుక్రవారం భేటీ కానున్నాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక పేరిట ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నాయి. దీనికి అన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను ఆహ్వానించినట్లు ఐక్యవేదిక నేతలు తెలిపారు.

* పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని, ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, శ్రీనివాసరావు తెలిపారు. ఏ క్షణమైనా సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని