కొత్త జిల్లాలకు అనుకూలంగా వైకాపా ర్యాలీలు
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా వైకాపా ఆధ్వర్యంలో గురువారం పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా వైకాపా ఆధ్వర్యంలో గురువారం పలుచోట్ల ర్యాలీలు నిర్వహించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం టౌన్హాలు నుంచి జీటీ రోడ్డు మీదుగా వైఎస్సార్ కూడలి వరకు ర్యాలీ చేపట్టారు. అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాను ప్రకటించినందుకు హర్షం వ్యక్తంచేస్తూ పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నేతృత్వంలో అయినవిల్లి సిద్ధివినాయకస్వామి ఆలయం నుంచి ముక్తేశ్వరం వరకు ర్యాలీ నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాశ్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. నెల్లూరు, అనంతపురం, కడప, కర్నూలుజిల్లాల్లోనూ ప్రదర్శనలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్