Andhra News: పాఠశాలలో 48 గంటలపాటు ఉపాధ్యాయుడి దీక్ష

కొత్త పీఆర్సీతో ఉపాధ్యాయులకు నష్టం జరుగుతోందని నిరసిస్తూ... 48 గంటలపాటు నీళ్లు మాత్రమే తీసుకొని పాఠాలు బోధించిన చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం బాలినాయనిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల

Published : 09 Feb 2022 10:03 IST

వైఎస్‌ఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిని సస్పెండ్‌ చేసిన డీఈవో

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు- న్యూస్‌టుడే, నిమ్మనపల్లె: కొత్త పీఆర్సీతో ఉపాధ్యాయులకు నష్టం జరుగుతోందని నిరసిస్తూ... 48 గంటలపాటు నీళ్లు మాత్రమే తీసుకొని పాఠాలు బోధించిన చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం బాలినాయనిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు, వైఎస్‌ఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిని డీఈవో శేఖర్‌ మంగళవారం సస్పెండ్‌ చేశారు. ఆయన సోమవారం దీక్ష ప్రారంభించగా మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. ఈ విషయమై నివేదిక ఇవ్వాలంటూ మంగళవారం ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. డీఈవో సూచనతో ఎంఈవో... విష్ణువర్ధన్‌రెడ్డి వివరణ తీసుకున్నారు. ఉపాధ్యాయులందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే దీక్షకు దిగానని.. యథావిధిగా పాఠాలు చెప్పానని ఆయన పేర్కొన్నట్లు తెలిసింది. ఎంఈవో నుంచి నివేదిక అందిన తర్వాత ఆగమేఘాలపై విష్ణువర్ధన్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు. వైకాపాకు అనుబంధంగా ఉన్న వైఎస్‌ఆర్‌టీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శిని సస్పెండ్‌ చేయడం చిత్తూరు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విధులకు హాజరవుతూనే... పాఠాలు బోధిస్తూ శాంతియుతంగా దీక్ష చేపట్టిన ఉపాధ్యాయుణ్ని సస్పెండ్‌ చేయడం ఎంతవరకు సబబని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని