Andhra News: ఆ భూమి చంద్రబాబు కుటుంబీకులదే
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబీకుల ఆధీనంలోని భూమిని అదే గ్రామానికి చెందిన రాజేంద్రనాయుడు ఆక్రమించడంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. శనివారం ఇరువర్గాలనుంచి తెప్పించిన దస్త్రాలను తహసీల్దారు శిరీష పరిశీలించారు
ఆక్రమిత భూమి దస్త్రాలు పరిశీలించిన తహసీల్దార్
చంద్రగిరి గ్రామీణ, న్యూస్టుడే: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబీకుల ఆధీనంలోని భూమిని అదే గ్రామానికి చెందిన రాజేంద్రనాయుడు ఆక్రమించడంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. శనివారం ఇరువర్గాలనుంచి తెప్పించిన దస్త్రాలను తహసీల్దారు శిరీష పరిశీలించారు. చంద్రబాబు కుటుంబం తరఫు ప్రతినిధి రిజిస్ట్రేషన్ కార్యాలయంనుంచి తీసుకువచ్చిన ఈసీలో నారా ఖర్జూరనాయుడు పేరుంది. కృష్ణమనాయుడు, ఆయన భార్య సిద్ధమ్మల పేర్లు ఇందులో లేకపోవడంతో ఆ భూమి చంద్రబాబు కుటుంబానికి చెందుతుందని తహసీల్దార్ నిర్ధారణకు వచ్చారు. ఆక్రమణకు పాల్పడిన రాజేంద్రనాయుడు తన వద్దనున్న ఆన్లైన్ అడంగల్, పట్టాదారు పాసుపుస్తకాన్ని చూపారు. ఆన్లైన్లో తన తల్లి పేరు ఉన్నందున ఆ భూమిపై బ్యాంకు రుణం తీసుకున్నానని, కంచె వేసేందుకు రాళ్లు నాటానని రాజేంద్రనాయుడు తెలిపారు. చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ దస్త్రాలున్నవారి పేరుపైనే ఆన్లైన్లో ఆ భూమిని మార్పు చేయాల్సి ఉంటుందని, చంద్రబాబు కుటుంబీకులు మీసేవ ద్వారా దరఖాస్తు చేస్తే మార్చుతామని తహసీల్దారు స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్