Mohan babu: మోహన్‌బాబు, విష్ణులవి పట్టా భూములే

సినీ నటుడు మంచు మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణు పేరిట దరఖాస్తు పట్టా భూములు ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన నేపథ్యంలో చంద్రగిరి తహసీల్దార్‌ శిరీష.. వారి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.

Updated : 03 Mar 2022 07:48 IST

చంద్రగిరి గ్రామీణ, న్యూస్‌టుడే: సినీ నటుడు మంచు మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణు పేరిట దరఖాస్తు పట్టా భూములు ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన నేపథ్యంలో చంద్రగిరి తహసీల్దార్‌ శిరీష.. వారి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘రెవెన్యూ రికార్డుల మేరకు రామిరెడ్డిపల్లి-68 గ్రామ రెవెన్యూ సర్వే నంబరు 412-1లో 5.29 ఎకరాల భూమికి 1928లో దరఖాస్తు పట్టాలు మంజూరుచేశారు. ఈ భూమిపై 1942 నుంచి 2001 వరకు 11 సార్లు క్రయవిక్రయాలు జరిగాయి. 18.6.1954 కంటే ముందు మంజూరైన దరఖాస్తు పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రాష్ట్రప్రభుత్వం 2016లో జీవో 215ను జారీచేసింది. ఈ క్రమంలో మోహన్‌బాబు, విష్ణు పేరిట ఉన్న భూములు డీకేటీ నుంచి పట్టా భూములుగా మారాయి. ఆన్‌లైన్‌లో డీకేటీగా కొనసాగడంతో ఈ సమస్య తలెత్తింది’ అని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని