Andhra News: కర్నూలులోనే న్యాయ రాజధాని: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

ప్రభుత్వ అనుమతులన్నీ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు భవనాలను కర్నూలు నగర శివారులోని జగన్నాథ్‌గుట్టపై నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె వద్ద రూ.57.35 కోట్లతో చేపట్టనున్న సంజీవయ్యసాగర్‌ జలాశయం అభివృద్ధి పనులకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి

Updated : 02 Apr 2022 08:15 IST

గోనెగండ్ల, న్యూస్‌టుడే: ప్రభుత్వ అనుమతులన్నీ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు భవనాలను కర్నూలు నగర శివారులోని జగన్నాథ్‌గుట్టపై నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె వద్ద రూ.57.35 కోట్లతో చేపట్టనున్న సంజీవయ్యసాగర్‌ జలాశయం అభివృద్ధి పనులకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శుక్రవారం భూమిపూజ చేశారు. శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. రాయలసీమపై ఉన్న మమకారంతోనే ముఖ్యమంత్రి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించారని తెలిపారు. రాష్ట్రంలో రెండో జాతీయ న్యాయ కళాశాలనూ కర్నూలులోనే ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కర్నూలులో రూ.100 కోట్లతో సిల్వర్‌ జూబ్లీ కళాశాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని