AP New Districts: జిల్లా కలెక్టర్లుగా దంపతులు..

శ్రీకాకుళం జిల్లా మందస మండలం పిడిమందస గ్రామానికి చెందిన శనాపతి ఢిల్లీరావు, ఆయన భార్య పి.ప్రశాంతి ఇద్దరూ రెండు జిల్లాలకు కలెక్టర్లుగా నియమితులవడంతో ఈ ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 06 Apr 2022 09:24 IST

మందస, న్యూస్‌టుడే: శ్రీకాకుళం జిల్లా మందస మండలం పిడిమందస గ్రామానికి చెందిన శనాపతి ఢిల్లీరావు, ఆయన భార్య పి.ప్రశాంతి ఇద్దరూ రెండు జిల్లాలకు కలెక్టర్లుగా నియమితులవడంతో ఈ ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన వీరు అనుకున్నట్లుగా కలెక్టర్లుగా స్థిరపడ్డారు. 2006లో గ్రూప్‌-1లో ఎంపికై.. 2008లో ఢిల్లీరావు విజయనగరం, ప్రశాంతి పార్వతీపురం ఆర్డీవోలుగా విధుల్లో చేరారు. ప్రస్తుతం జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఢిల్లీరావు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరుగా, ప్రశాంతి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరుగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని