Andhra News: ఆడుకుంటూ.. అడవికి చేరిన చిన్నారి
చిత్తూరు జిల్లా కుప్పంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారిని సోమవారం పోలీసులు అడవిలో గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. అర్బన్ సీఐ శ్రీధర్ కథనం మేరకు.. కుప్పం మండలం కంగుంది పంచాయతీ శివారు నక్కలగుంట
36 గంటల తర్వాత తల్లిదండ్రుల చెంతకు
కుప్పం పట్టణం, న్యూస్టుడే: చిత్తూరు జిల్లా కుప్పంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారిని సోమవారం పోలీసులు అడవిలో గుర్తించి ఇంటికి తీసుకొచ్చారు. అర్బన్ సీఐ శ్రీధర్ కథనం మేరకు.. కుప్పం మండలం కంగుంది పంచాయతీ శివారు నక్కలగుంట గ్రామానికి చెందిన మణి, కవితల కుమార్తె జోషిక(4) శనివారం సాయత్రం ఇంటి బయట ఆడుకుంటూ కనిపించకుండా పోయింది. చుట్టుపక్కలా గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ రిషాంత్రెడ్డి ఆదేశాలతో పలమనేరు డీఎస్పీ గంగయ్య నేతృత్వంలో రాత్రంతా వెతికారు. ఇంటి సమీపంలోని నాలుగు నీటి కుంటల్లో అగ్నిమాపక శాఖ ద్వారా నీరు తోడించారు. డాగ్ స్వ్కాడ్ ద్వారా బాలిక దుస్తులు చూపగా ఆ జాగిలం అటవీ ప్రాంతంలో ఆగింది. దీంతో అటవీ ప్రాంతంలో గాలించి అంబాపురం అటవీ ప్రాంతంలో గుర్తించారు. నాలుగేళ్ల పాప అంతటి అడవిలో 36 గంటల పాటు ధైర్యంగా గడిపిందని, ఎండతీవ్రత కారణంగా వడదెబ్బకు అలసటగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించామని సీఐ తెలిపారు. ముళ్లచెట్లు గీసుకొని చేతికి, కాళ్లకు గాయాలయ్యాయని, పాప ఆరోగ్యం సాధారణంగానే ఉందని వివరించారు. ఎస్సైలు ఉమామహేశ్వర్రెడ్డి, శివకుమార్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..