Andhra News: బాలినేని తగ్గడం వల్లే మళ్లీ పదవి: ఆదిమూలపు

తనకు కేటాయించిన శాఖ తన నియోజకవర్గానికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రితోనూ తాను అన్నానని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు.

Updated : 01 May 2022 07:18 IST

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: తనకు కేటాయించిన శాఖ తన నియోజకవర్గానికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రితోనూ తాను అన్నానని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రెండడుగులు వెనక్కి తగ్గడం వల్లే తనకు రెండోసారి మంత్రి పదవి దక్కిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని