AP DGP: ఏకపక్ష ధోరణి లేకుండా చూస్తా
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించే ధోరణి లేకుండా చూస్తానని నూతన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి చెప్పారు. వివాదాలకు తావివ్వకుండా పోలీసు వ్యవస్థను నిర్దిష్ట పద్ధతిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
వివాదాలకు తావివ్వకుండా పోలీసు వ్యవస్థను నిర్దిష్ట పద్ధతిలో తీసుకెళ్తా
కొత్త డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి
ఈనాడు, అమరావతి: పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించే ధోరణి లేకుండా చూస్తానని నూతన డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి చెప్పారు. వివాదాలకు తావివ్వకుండా పోలీసు వ్యవస్థను నిర్దిష్ట పద్ధతిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తనపై విశ్వాసంతో చాలా పెద్ద బాధ్యత అప్పగించారన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు ప్రతిష్ఠ, గౌరవం పెంచేలా వ్యవహరిస్తానని పేర్కొన్నారు. విధి నిర్వహణలో తప్పులు జరిగినప్పుడు, నిరాధార ఆరోపణలకు గురైనప్పుడు సిబ్బందికి బాసటగా ఉంటానని ప్రకటించారు.
ప్రవర్తన నియమావళి ఉల్లంఘించే వారిపై మాత్రం కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజా సహకారం పొందేలా డీఐజీలు, ఎస్పీలు.. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి మార్గనిర్దేశం చేయాలన్నారు. రాష్ట్ర డీజీపీగా శనివారం బాధ్యతలు స్వీకరించిన రాజేంద్రనాథరెడ్డి మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో పోలీసు యూనిట్ల స్వరూపం, సిబ్బంది విభజన తదితర అంశాలపై పోలీసు ఉన్నతాధికారులతో కమిటీ వేశామని, ప్రస్తుతం అధ్యయనం జరుగుతోందని చెప్పారు. ఉగాదికి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాల్సి ఉన్నందున ఈ అంశాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. కొత్త పోలీసు కమిషనరేట్ల ఏర్పాటు అంశం చర్చల్లో ఉందని, దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
ప్రభుత్వ సంస్థలపై దాడులు సహించం
‘ఇటీవల కొన్నిచోట్ల ప్రభుత్వ సంస్థలపై దాడులు చోటుచేసుకున్నాయి. అలాంటి ఘటనల్లో బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తా. మతపరమైన చిన్నచిన్న వివాదాలు తలెత్తితే స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వాటిని పరిష్కరించాలి. పోలీసు శాఖను ప్రక్షాళించాల్సిన అవసరం ఉంటే చేస్తా. వీవీఐపీలు, వీఐపీల కార్యక్రమాల్లో భద్రతాపరమైన ఆంక్షల వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రముఖుల భద్రతకూ సమస్య తలెత్తకుండా ఎలా వ్యవహరించాలో అధ్యయనానికి కమిటీ వేశాం. ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తా. మహిళలు, చిన్నారులు, అణగారిన వర్గాలపై జరిగే నేరాల విషయంలో పోలీసులు సత్వరం స్పందించాలి. ఎర్రచందనం అక్రమ రవాణా, గంజాయి సాగు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నిస్తాం. గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లిస్తాం. మావోయిస్టుల సమస్యను ఎలా ఎదుర్కోవాలో ఏపీ పోలీసుకు బాగా తెలుసు’ అని అన్నారు.
అప్పగించిన బాధ్యతలు నెరవేర్చా: గౌతమ్ సవాంగ్
పోలీసుశాఖ గతంలో ఎన్నడూ చూడని సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని, అలాంటి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అప్పగించిన బాధ్యతల మేరకు పనిచేశానని పదవీ విరమణ చేసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. కొత్త డీజీపీకి బాధ్యతలు అప్పగించిన అనంతరం సవాంగ్ దంపతుల్ని పోలీసు అధికారులు, సిబ్బంది పూలతో అలంకరించిన వాహనంలో ఎక్కించి, మంగళగిరి బెటాలియన్లో పరేడ్ నిర్వహించి గౌరవ వీడ్కోలు పలికారు. సవాంగ్ మాట్లాడుతూ ‘రెండేళ్ల ఎనిమిది నెలలపాటు నన్ను డీజీపీగా కొనసాగించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. ఈ సమయంలో పోలీసు శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాను. నా హయాంలో 7,552 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం చేశాం. కొత్త డీజీపీ రాజేంద్రనాథరెడ్డి పోలీసు వ్యవస్థను ఉన్నత శిఖరాలపై నిలబెడతారని ఆశిస్తున్నా’ అని అన్నారు.
ఆ ప్రశ్నకు నవ్వే సమాధానం
‘ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా, రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరిస్తారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా డీజీపీ పెద్దగా నవ్వారు.
విలేకరి: ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రతిష్ఠకు గత రెండున్నరేళ్లలో తీవ్ర విఘాతం కలిగింది. దాన్ని ఎలా అధిగమిస్తారు?
డీజీపీ: మీ మాటలతో నేను ఏకీభవించట్లేదు. ఎక్కడ సమస్య వచ్చినా సత్వరమే స్పందించాం. అవసరమైనచోట పరిస్థితులు చక్కదిద్దుతాం.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆ పరిస్థితిని ఎలా మారుస్తారు?
అలాంటి ధోరణి లేకుండా చూస్తాం. వివాదాలకు తావివ్వం.
ప్రభుత్వ విధానాల్ని విమర్శించినా, లోపాలు ఎత్తిచూపినా వారి భావప్రకటన స్వేచ్ఛ హరించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దానికి మీరు అడ్డుకట్ట వేస్తారా?
అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూస్తాం.
కొన్నిచోట్ల పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు?
అలా దురుద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవగా.. పార్టీల నాయకులు వివిధ రూపాల్లో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నారు. -
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ