రాత్రి వేళ బయటికొస్తే కేసులే!
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ శనివారం నుంచి అమలులోకి వచ్చింది.
అనుమతి ఉన్నవారికి గుర్తింపు కార్డు తప్పనిసరి!
రాత్రి కర్ఫ్యూపై నిబంధనల ఖరారు
శనివారం నుంచే అమల్లోకొచ్చిన ఆంక్షలు
ఈనాడు డిజిటల్, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ శనివారం నుంచి అమలులోకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం పలు నిబంధనలతో కూడిన ఉత్తర్వులను శనివారం జారీ చేసింది. ప్రతిరోజూ.. రాత్రి 10 గంటల నుంచి ఉదయం అయిదింటి వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ సమయంలో ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, ఔషధ దుకాణాలు, అత్యవసర సేవలందించే సంస్థలు తప్ప మిగిలిన అన్ని కార్యాలయాలు, సంస్థలు, రెస్టారెంట్లు.. మూసి వేయాలని ఆదేశించింది. ఈ సమయంలో జనం కూడా అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దని సూచించింది.
ఎవరెవరికి సడలింపు
* ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలీకమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసులు, బ్రాడ్కాస్టింగ్, కేబుల్ సర్వీసులు, ఐటీ, సంబంధిత సేవలు, పెట్రోలు, గ్యాస్ బంకులు, విద్యుత్ సంస్థలు, నీటి సరఫరా, శానిటేషన్ సంస్థలు, కోల్డ్ స్టోరేజీలు, వేర్ హౌస్లు, ప్రైవేటు సెక్యూరిటీ సర్వీసులు, నిరంతరం సాగాల్సిన సేవలకు సంబంధించిన తయారీ కేంద్రాలు, ఫుడ్ డెలివరీ సర్వీసులు వంటి వాటిలో పనిచేసే వారు బయట తిరగొచ్చు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ఉద్యోగులు, పంచాయతీరాజ్ ఉద్యోగులు, అత్యవసర సేవల ఉద్యోగులు... సరైన డ్యూటీ, ఐడీ కార్డులను చూపించి అవసరముంటేనే బయట తిరగొచ్చు.
* వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, హాస్పిటాలిటీ సేవల సిబ్బంది గుర్తింపు కార్డులతో తిరగొచ్చు.
* గర్భిణులు, వైద్య సేవలవసరమైన రోగులు బయటకు రావొచ్చు.
* ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు రాకపోకలు జరిపే వారు... సరైన గుర్తింపు కార్డు చూపించాలి.
* రాష్ట్రంలో, రాష్ట్రం బయటకు గూడ్స్ సరఫరాపై ఎలాంటి ఆంక్షలూ లేవు.
* ఆటోలు, టాక్సీలు ఇతర ప్రజా రవాణా వాహనాలు.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. కర్ఫ్యూ సయయంలో పైన పేర్కొన్న వారి కోసం పనిచేయొచ్చు.
ఎప్పటి వరకు...: ఆంక్షల సడలింపుపై తదుపరి ప్రకటన వచ్చేంత వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయి. నిబంధనలను అతిక్రమిస్తే.. విపత్తు నిర్వహణ చట్టం-2005 సెక్షన్ 51, 60, ఐపీసీ 188, తదితర చట్టాల కింద కేసులు పెట్టే అవకాశముంది.
అంతటా రాత్రి కర్ఫ్యూ
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా శనివారం రాత్రి పది గంటలకు రాత్రి కర్ఫ్యూ మొదలైంది. మొదటి రోజు కావడంతో ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరో రోజు ప్రచారం కల్పించి ఆపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పలు చోట్ల వాహనాలను దారి మళ్లించారు. కొన్నిచోట్ల బారికేడ్లతో దారులు మూసివేశారు. విజయవాడలోని ప్రధాన కేంద్రాలు.. బెంజి సర్కిల్, కాళేశ్వరరావు మార్కెట్, బిసెంట్ రోడ్డు వంటి ప్రాంతాల్లో పోలీసులు దుకాణాలను మూసేయించారు. రాత్రి 11వరకూ దుకాణాలు తెరిచి ఉండే బిసెంట్ రోడ్డు తొమ్మిదింటికే నిర్మానుష్యంగా మారింది. ఆర్టీసీ బస్సులను సైతం జాతీయ రహదారి వైపు దారి మళ్లించారు. విశాఖలోని ప్రధాన కూడళ్ల వద్ద రాత్రి తొమ్మిదింటినుంచే జనం రాకపోకలు తగ్గాయి. శ్రీకాకుళంలో పది తరువాత జనం పెద్దగా బయటకు రాలేదు. సాయంత్రం ఆరింటికే కొందరు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో సైతం ఎనిమిదింటి తరువాత దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు. అనంతపురంలో సైతం కర్ఫ్యూ ఆంక్షలతో రోడ్లు నిర్మానుష్యమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజం చెబితే.. గురువులకు నోటీసులు!
‘ఎప్పుడూ సత్యమే పలకాలని’ పిల్లలకు చెప్పే ఉపాధ్యాయులు.. తాము నిజం చెబితే షోకాజ్ నోటీసులు అందుకోవలసి వస్తోంది. వైకాపాతో అంటకాగుతున్న పాఠశాల విద్యాశాఖలోని ఓ ఉన్నతాధికారి బరితెగించి వ్యవహరిస్తున్నారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణత ఉద్దేశపూర్వకంగానే తగ్గిస్తున్నారా?
రాష్ట్ర ప్రభుత్వం 2019 నుంచి తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయాలని కంకణం కట్టుకుందని సామాజిక కార్యకర్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
భారీ యంత్రాలతో ఇసుక తోడేద్దాం..
రాష్ట్రంలో ‘ముఖ్య’ నేత సోదరుడి కనుసన్నల్లో సాగుతున్న ఇసుక దోపిడీని మరింత భారీ స్థాయిలో చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. -
స్వగ్రామాల్లో జీవనం సాగించేలా పిటిషనర్లకు రక్షణ కల్పించండి
రాజకీయ కక్షతో తమను గ్రామాల నుంచి తరిమేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన అనుచరుల నుంచి రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు స్పందించింది. -
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ