AP Highcourt: అవినీతి కేసుల్లో అలసత్వమా?
అవినీతి కేసుల్లో దర్యాప్తు, అభియోగపత్రం దాఖలులో జాప్యం జరుగుతుండటంతో అనిశాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అవినీతి కేసుల్లో అనిశా కఠినంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించింది.
సకాలంలో అభియోగపత్రం దాఖలు చేయనందుకు అనిశాపై హైకోర్టు ఆగ్రహం
స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని డీజీకి ఆదేశం
ప్రభుత్వం ఇలా నడవడానికి వీల్లేదని ఘాటు వ్యాఖ్య
ఈనాడు, అమరావతి: అవినీతి కేసుల్లో దర్యాప్తు, అభియోగపత్రం దాఖలులో జాప్యం జరుగుతుండటంతో అనిశాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అవినీతి కేసుల్లో అనిశా కఠినంగా వ్యవహరించడం లేదని వ్యాఖ్యానించింది. ప్రకాశం జిల్లా కొమరోలులోని ఎస్ఎల్వీ ఎడ్యుకేషనల్ సొసైటీపై వచ్చిన అవినీతి ఆరోపణల్లో 2018లో కేసు నమోదైనా, ఇంతవరకు అభియోగపత్రం(ఛార్జిషీట్) దాఖలు చేయకపోవడంపై అనిశా డీజీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. సంబంధిత సొసైటీకి రక్షణగా ఉంటూ ఉద్దేశపూర్వకంగా అభియోగపత్రం వేయడంలో జాప్యం చేస్తున్నారని అనిశాను తీవ్రంగా ఆక్షేపించింది. మొత్తం రికార్డులతో మార్చి 4న కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని అనిశా డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులుని ఆదేశించింది. అనిశా ముందు ప్రస్తుతం ఎన్ని కేసులు ఉన్నాయి... ఎన్ని కేసుల్లో దర్యాప్తు చేస్తున్నారు... అవి ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయో అఫిడవిట్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తామని డీజీని హెచ్చరించింది. అనిశా కేసుల్లో జాప్యాన్ని సహించబోమంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా నడవడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ ఎస్.సుబ్బారెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఈమేరకు ఆదేశాలిచ్చింది.
* ఎస్ఎల్వీ ఎడ్యుకేషనల్ సొసైటీకి చెందిన పాఠశాలల ఉన్నతీకరణ(అప్గ్రేడ్), విభజన, ప్రభుత్వ పథకాల అమలులో అక్రమాలపై విచారణ చేయాలని ప్రకాశం జిల్లా డీఈవోను పాఠశాల విద్య డైరెక్టర్ ఆదేశించడాన్ని సవాలు చేస్తూ సంబంధిత సొసైటీ కార్యదర్శి, ఎస్బీఎన్ఆర్ఎం ఎయిడెడ్ హైస్కూల్ కరస్పాండెంట్ బి.నారాయణరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి దాన్ని కొట్టేశారు. డీఈవో వద్ద విచారణకు హాజరై పరిశీలన నిమిత్తం రికార్డులు సమర్పించాలని 3 నవంబరు 2021న తీర్పు ఇచ్చారు. ఆ తీర్పును సవాలు చేస్తూ ఆ సొసైటీ కార్యదర్శి ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు. దస్త్రాలను పరిశీలించిన ధర్మాసనం... 2018 జనవరి 21న ఈ వ్యవహారంపై అనిశా కేసు నమోదు చేసినట్లు గుర్తుచేసింది. ఇప్పటివరకు అభియోగపత్రం వేయకపోవడంపై తీవ్రంగా మండిపడింది. అనిశా తరఫు న్యాయవాది సుభాని వాదనలు వినిపిస్తూ... దర్యాప్తు తుదిదశలో ఉందని, అభియోగపత్రం వేయడానికి ప్రభుత్వం నుంచి అనుమతి అవసరమన్నారు. మేము ఈ వ్యవహారాన్ని సీరియస్గానేతీసుకున్నామన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... కోర్టు ముందుంచిన పత్రాలే ఏమాత్రం సీరియస్గా తీసుకున్నారో తెలియజేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేసింది. సంచిలోని పిల్లిని బయటకు ఎలా తీసుకురావాలో తమకు తెలుసంది. కేసు డైరీతోపాటు పూర్తి రికార్డులతో అనిశా డీజీ కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. -
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం సాయంత్రం సాగిన సీఎం జగన్ రోడ్డుషో కారణంగా ఆర్టీసీ కాంప్లెక్స్లో రెండున్నర గంటలపాటు బస్సులు నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. -
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
‘మేమంతా సిద్ధం’ అంటూ సీఎం జగన్, ఇతర నేతలు జనంలోకి వచ్చినా ప్రజలు మాత్రం సిద్ధంగా లేమన్న సంకేతమిచ్చారు. -
‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
తెలంగాణలో హరితం.. ఆంధ్రాలో క్షామం
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు అయిన పెదవాగుపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. -
అపరిచితుడొచ్చాడు.. ‘ఆస్కార్లు సిద్ధమా?’
సాగిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపిస్తున్న చిత్రాలు. వీటన్నింటినీ చూస్తుంటే.. అంతా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయని పిల్లలకూ ఇట్టే అర్థమైపోతుంది. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. -
నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. -
జగన్ వచ్చె.. జనం హడలే!
సీఎం జగన్ వస్తున్నారంటేనే ప్రజలు హడలెత్తే పరిస్థితి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర సాగే ప్రాంతాల్లో దారిపొడవునా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. -
మాచర్లలో కూలిన వసతిగృహం గోడ
పల్నాడు జిల్లా మాచర్ల రింగురోడ్డు ప్రాంతంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతిగృహం భవనంపై ఉన్న పిట్టగోడ్డ గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలి కిందపడింది. -
కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. -
అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. -
సీజేను కలిసిన బార్ కౌన్సిల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్
ఏపీ న్యాయవాద మండలి (బార్ కౌన్సిల్) ఛైర్మన్, వైస్ ఛైర్మన్లుగా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన నల్లారి ద్వారకానాథరెడ్డి, సిరిపురపు కృష్ణమోహన్ సీజే జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ను హైకోర్టులో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. -
వివేకా హత్యకేసుపై మాట్లాడొద్దు
మాజీ మంత్రి వివేకా హత్యకేసు అంశంపై వైఎస్ షర్మిల, వివేకా కుమార్తె సునీత, చంద్రబాబునాయుడు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కల్యాణ్, పులివెందుల తెదేపా అభ్యర్థి బీటెక్ రవి తరచూ మాట్లాడుతున్నారని, వారు ఈ వ్యాఖ్యలు చేయకుండా చూడాలని వైకాపా వైయస్ఆర్ జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కడప కోర్టులో పిటిషన్ వేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై ఎన్నికల కోడ్లో ఐఏఎస్ల కమిటీ భేటీ
రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంలో మధ్యస్థాయి అధికారుల (ఎంఎల్ఓ) కమిటీ ఇచ్చిన నివేదికపై ఐఏఎస్ అధికారుల కమిటీ భేటీని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం వ్యతిరేకిస్తోంది. -
చిరుద్యోగులకూ వేతనాలు ఇవ్వలేరా?
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిరుద్యోగులకు సైతం వేతనాలు సకాలంలో అందడం లేదు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆరోగ్యమిత్రలు, 108, 104 సిబ్బందికి ఏప్రిల్ మూడో వారం వచ్చినప్పటికీ మార్చి నెల వేతనాలు చెల్లించలేదు -
అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలొద్దు
స్కిల్ కేసులో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడిపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని ఆదేశిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది.