AP PRC: అమ్ముడుపోయారు.. అన్యాయం చేశారు
పీఆర్సీ పై మంత్రుల కమిటీతో శనివారం రాత్రి పీఆర్సీ సాధన సమితి నాయకులు చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు.
సాధన సమితి నేతలపై ఉపాధ్యాయుల ధ్వజం
ఏపీటీఎఫ్ నాయకుల నిరసనలు
మంత్రుల కమిటీ ఒప్పంద పత్రాలను దహనం
ఈనాడు, అమరావతి, చోడవరం, న్యూస్టుడే: పీఆర్సీ పై మంత్రుల కమిటీతో శనివారం రాత్రి పీఆర్సీ సాధన సమితి నాయకులు చేసుకున్న ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. మంత్రుల కమిటీతో చేసుకున్న ఒప్పంద పత్రాలను దహనం చేశారు. ఫిట్మెంట్ పెంపు లేకుండానే ఒప్పందం చేసుకున్నారని, హెచ్ఆర్ఏ శ్లాబులతో గ్రామీణ ప్రాంత ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల పాదాల ముందు దళారి నాయకులు ఉద్యమాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. ప్రభుత్వంతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని, లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్దారులను నమ్మించి సాధన సమితి నాయకులు మోసం చేశారని పేర్కొన్నారు. సమ్మె విరమణ నిర్ణయం సమంజసం కాదని, ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు పూర్తి విరుద్ధంగా మంత్రుల కమిటీతో ఒప్పందాలు ఉన్నాయని విమర్శించారు.
లాలూచీ పడ్డారు..
‘ఉద్యోగ సంఘ నేతలు ప్రభుత్వానికి లొంగిపోయారు.. నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు’ అని అంటూ విశాఖ జిల్లా చోడవరంలోని గాంధీ విగ్రహం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆదివారం నిరసన తెలిపారు.‘అమ్ముడుపోయారు.. అన్యాయం చేశారు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
* నర్సీపట్నంలో ఆర్డీవో కార్యాలయం లోపల వేతన ప్రతులను దహనం చేశారు. అనకాపల్లి, పాడేరు పట్టణాల్లోనూ ఏపీటీఎఫ్ నాయకులు చర్చల ఒప్పంద పత్రాలు దహనం చేశారు. ప్రభుత్వంతో జరిగిన ఒప్పందాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామంటూ ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మోసూరి మహలక్ష్మినాయుడు పేర్కొన్నారు. ప్రభుత్వం కన్నా పీఆర్సీ సాధన సమితి నాయకులే ఉద్యోగులను ఎక్కువగా ద్రోహం చేశారని డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.
మోసం చేశారు..
* గుంటూరులోని ఏపీటీఎఫ్ కార్యాలయం ఎదుట మంత్రుల కమిటీ ఒప్పంద పత్రాలను ఉపాధ్యాయులు దహనం చేశారు.
* రాష్ట్ర నాయకత్వం ఏకపక్షంగా సమ్మె విరమించిందంటూ నెల్లూరులో కోర్టు ఉద్యోగి కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు.
దిష్టిబొమ్మల దహనం
చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు మండలాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు ఆదివారం భాకరాపేటలో నేతల దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లా కేంద్రం చిత్తూరులోని ఎన్జీవో భవనంలో పీఆర్సీ సాధన సమితి జిల్లా నాయకులు రాఘువులు, గంటా మోహన్ తదితరులు సమావేశమయ్యారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీ జీవోలను వెనక్కు తీసుకుంటేనే చర్చలకు వస్తామని చెప్పిన నాయకులు.. ఇప్పుడు ఏకంగా సమ్మె విరమణకు పిలుపునివ్వడమేంటన్నారు. నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తిరుపతిలో ఏపీ సీపీఎస్ ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. నాలుగు జేఏసీల నాయకులు ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాలను పణంగా పెట్టాôటూ మదనపల్లె డివిజన్ జేఏసీ సెక్రటరీ జనరల్ రవి ప్రకాష్, కో- ఛైర్మన్ వెంకట రమణ రాజీనామా చేశారు.
* ప్రకాశం జిల్లా పొదిలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ చేశారు. ఐకాస నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
* కడప జిల్లా పోరుమామిళ్లలోని గిరినర్లో ఐకాసల ఛైర్మన్ల శవయాత్రను నిర్వహించారు. ప్రభుత్వానికి అమ్ముడుపోయిన నాయకులు డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు.
ఏపీ ఐకాసకు ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజీనామా
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్దారుల ఆశలు వమ్ము చేసిన ఏపీ ఐకాస నాయకత్వ వైఖరికి నిరసనగా ఐకాసలోని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భానుమూర్తి, పాండురంగ వరప్రసాదరావు తెలిపారు. ఈ మేరకు ఐకాసఛైర్మన్ బండి శ్రీనివాసరావుకు లేఖ రాశారు.
ఉపాధ్యాయుల ఉద్యమ బాట
ఈనాడు, అమరావతి: పీఆర్సీ ఫిట్మెంట్పై ఉపాధ్యాయులు ఆందోళన బాటపట్టారు. ఫిట్మెంట్ 27శాతం ఇవ్వాలని, ఇంటి అద్దె భత్యం కనీసం 12 శాతానికిపైగా ఉండాలని, సీపీఎస్ రద్దుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) దశలవారీ పోరాటాలకు పిలుపునిచ్చింది. మంత్రుల కమిటీతో శనివారం రాత్రి జరిగిన చర్చల్లో ఫిట్మెంట్పై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో చర్చల ఒప్పందాన్ని వ్యతిరేకించారు. ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువగా ఉండకూడదని, ఇంటి అద్దె భత్యం కనీస శ్లాబు 12శాతం ఉండాలని మంత్రుల కమిటీ ముందు ప్రతిపాదన ఉంచినా పట్టించుకోలేదని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఫిట్మెంట్ 27శాతం ఉండాలని మంత్రుల కమిటీని కోరినా అది ముగిసిన అధ్యాయమని, దీనిపై సీఎంతోనూ మాట్లాడే అవకాశం లేదని చెప్పారని వెల్లడించారు. ఆ సమయంలోనే దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేశామని వెల్లడించారు. ఫిట్మెంట్, ఇంటి అద్దె భత్యం శ్లాబులు, సీపీఎస్ రద్దుపై స్పష్టమైన హామీ లభించకపోవడంపై ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కలిసొచ్చే సంఘాలతో ఉద్యమంలోకి వెళ్లాలని ఫ్యాప్టో నిర్ణయించింది. ఫ్యాప్టో ఛైర్మన్ జోసెఫ్ సుధీర్బాబు అధ్యక్షతన ఆదివారం వర్చువల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ పోరాటంలో కలిసి వచ్చే సంఘాలతో ఐక్యవేదిక ఏర్పాటు చేస్తామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుధీర్బాబు, శరత్చంద్ర తెలిపారు. మంత్రుల కమిటీ చర్చలలో ఉపాధ్యాయులు, సీపీఎస్ సమస్యలు, ఒప్పంద, పొరుగుసేవలు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల ప్రస్తావన లేకపోవడాన్ని నిరసిస్తున్నామని పేర్కొన్నారు. మొదటి దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.
ఉద్యమ కార్యాచరణ ఇలా..
* సోమవారం నుంచి వారం రోజులపాటు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరు
* 11న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాల సమర్పణ
* 12న విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనే కాదు.. మంత్రులు వచ్చినా అంతే!
ముఖ్యమంత్రి జగన్ పర్యటనలకే కాదు.. మంత్రుల ర్యాలీలప్పుడు కూడా పచ్చని చెట్లని కొట్టేస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్లోని తారకరామనగర్కు వెళ్లే దారిలో మంత్రి బుగ్గన నామినేషన్ దాఖలు ర్యాలీకి చెట్లు అడ్డొస్తున్నాయని వాటి కొమ్మలు నరికేశారు. -
వేలకొద్దీ మద్యం సీసాలు.. వైకాపా నాయకులకు ఎక్కడివి?
మారు సుధాకర్రెడ్డి.. వ్యవసాయ శాఖ మంత్రి, సర్వేపల్లి నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్రెడ్డికి ప్రధాన అనుచరుడు. కాకాణి తరఫున ముఖ్యమైన వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెడుతుంటారు. -
ఉత్తరాంధ్రలో శుభకార్యాలకు వెళ్లడం కష్టమే
సీఎం జగన్ ‘సిద్ధం’ పేరిట చేస్తున్న యాత్రలు, నిర్వహిస్తున్న సభలు రాష్ట్ర ప్రజలకు సంకటంగా మారాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు ముహూర్తాలు పెట్టుకొనేవారు ఆయా రోజుల్లో సమీప ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సభలు ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తున్నారు. -
గులకరాయి కేసు నిందితుడి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్
గులకరాయి కేసులో అరెస్టయి రిమాండ్లో ఉన్న నిందితుడు సతీష్ కుమార్ కస్టడీ కోసం పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
3 రోజులు కూలికి.. 3 రోజులు బడికి.. టెన్త్లో 509 మార్కులు
కూలి పనులకు వెళ్తే తప్ప పూట గడవని కుటుంబం వారిది. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బంటనహాలు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు, వన్నూరమ్మకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె బోయ నవీన పదో తరగతి, కుమారుడు రాజు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. -
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
హతవిధీ.. గిరిబాలుడి ప్రాణాలు ఆవిరి!
‘నా ఎస్టీ’లంటూ బహిరంగ సభల్లో ఎక్కడలేని ప్రేమ ఒలకబోసే జగన్ పాలనలో గిరిపుత్రుల బతుకులు గాలిలో దీపంలా మారాయి. అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లేందుకు రహదారులు లేని దుర్భర పరిస్థితుల మధ్య వారి బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. -
ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. -
నా.. నా.. నా.. అని బాకా.. చేసిందంతా ధోకా
మోసం... దగా... వంచన... ఇలా ఏ పేరు పెట్టినా ఎస్సీ, ఎస్టీలకు జగన్ చేసిన ద్రోహానికి సమానం కాదు. ఐదేళ్ల పాలనలో వారికి ప్రగతి అనేదే లేకుండా చేశారు. అట్టడుగువర్గాలైన దళిత, గిరిజనులకు ప్రత్యేక సాయం అందించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని నిర్ధాక్షిణ్యంగా కాలరాశారు. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
పోస్టల్ బ్యాలెట్పై స్పష్టతనివ్వాలి
గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో)కు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై స్పష్టతనిస్తూ ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వీఆర్వోల సంఘం సోమవారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. -
విద్య కమిషనరేట్లోకి ఆదర్శ పాఠశాలల టీచర్ల విలీనం
ఆదర్శ పాఠశాలల్లోని రెగ్యులర్ బోధన సిబ్బందిని.. పాఠశాల విద్య కమిషనరేట్లో విలీనం చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. గతనెల 15న ఎన్నికల కోడ్ అమల్లోకి రావడానికి ఒక్కరోజు ముందు ఇచ్చిన జీవోకు ప్రభుత్వం సోమవారం గెజిట్ జారీ చేసింది. -
పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్ల నియంత్రణకు పోలింగ్ రోజు రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రత కట్టుదిట్టం చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా సోమవారం ‘ఈనాడు’కు తెలిపారు. -
వాలంటీర్ల రాజీనామాలనుఅంగీకరించకుండా ఈసీని ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిసేవరకు వాలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలకశాఖ కమిషనర్, గ్రామ సచివాలయాలశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించాలని కోరుతూ. -
యాక్సిస్తో పీపీఏల ప్రతిపాదన తిరస్కరణ
యాక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మోకాలడ్డింది. -
‘పది’లో బీసీ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
పదో తరగతి పరీక్షల్లో మహాత్మా జ్యోతిబా ఫులె వెనుకబడిన తరగతుల పాఠశాలల విద్యార్థులు 98.43 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆ విద్యాలయాల కార్యదర్శి సోమవారం ప్రకటించారు. -
వెలంపల్లి సారూ.. ఈ భాగ్యవతి గుర్తుందా?
వృద్ధాప్యం, దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళ ఇలా ఏ కేటగిరీలో చూసినా భాగ్యవతికి పింఛను ఇవ్వచ్చు. అందుకోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. గత అయిదేళ్లుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. -
కరవు సీమలో ‘అవినీతి’ సిరి!
రాయలసీమలో ఓ వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబం ఐదేళ్లపాటు వసూళ్ల పంటను బ్రహ్మాండంగా పండించింది. ఆ పార్టీ అధికారంలోకి రాగానే ఆ ప్రజాప్రతినిధి మరిది, బావ, వియ్యంకుడు, కుమారుడు.. నాలుగు మండలాలను పంచుకుని మరీ దందాలను పర్యవేక్షిస్తున్నారు. -
50,000 → 10,117 → 3,350
‘‘మాట తప్పను.. మడమ తిప్పను. చెప్పింది చేస్తాం.. చెప్పనిదీ చేస్తాం..’’ ‘మీట’ల మాస్టర్ జగన్ ‘బ్రాండ్’ మాటలు ఇవి. కానీ, మాట మీద నిలబడే మనిషి కాదు కదా జగన్..! -
వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుచరుల దాష్టీకాలు.. దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ
మాజీ హోంమంత్రి, వైకాపా ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. -
‘ప్రోగ్రెస్ కాదు..’ అంతా బోగస్!
పరీక్షల్లో సున్నా మార్కులొచ్చే కొందరు మొద్దబ్బాయిలు... వాటికి ముందు 10 పెట్టేసి 100 మార్కులు వచ్చాయంటూ ప్రోగ్రెస్ రిపోర్టును మార్చేసి తల్లిదండ్రుల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తారు. తెలిసీ తెలియని వయసులో చిన్నపిల్లలు చేసే పనులవి.
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!