కరోనా సునామీ
రాష్ట్రంలో కరోనా రెండో దశ సునామీలా విరుచుకుపడుతోంది. కేవలం 12 రోజుల వ్యవధిలో లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నెల 13 నాటికి 9,32,892గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం నాటికి 10,33,560కు చేరింది. గతేడాది నవంబరు 3 నాటికి 8,30,731గా ఉన్న కరోనా కేసులు 9,32,892కు (లక్షకు పైగా) చేరటానికి 161 రోజుల సమయం పట్టగా.. ఈసారి అతి తక్కువ వ్యవధిలో అత్యంత వేగంగా లక్ష కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రాష్ట్రంలో 12,634 కొత్త కేసులొచ్చాయి. వైరస్ బారినపడిన వారిలో తాజాగా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండో దశలో కరోనా ఉద్ధృతికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 12,634 కేసులు
24 గంటల్లో 69 మంది మృతి
12 రోజుల్లో లక్షకు పైగా కేసుల నమోదు
ఈనాడు, అమరావతి
రాష్ట్రంలో కరోనా రెండో దశ సునామీలా విరుచుకుపడుతోంది. కేవలం 12 రోజుల వ్యవధిలో లక్షకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నెల 13 నాటికి 9,32,892గా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య ఆదివారం నాటికి 10,33,560కు చేరింది. గతేడాది నవంబరు 3 నాటికి 8,30,731గా ఉన్న కరోనా కేసులు 9,32,892కు (లక్షకు పైగా) చేరటానికి 161 రోజుల సమయం పట్టగా.. ఈసారి అతి తక్కువ వ్యవధిలో అత్యంత వేగంగా లక్ష కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రాష్ట్రంలో 12,634 కొత్త కేసులొచ్చాయి. వైరస్ బారినపడిన వారిలో తాజాగా 69 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండో దశలో కరోనా ఉద్ధృతికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా 62,885 నమూనాలను పరీక్షించగా.. అందులో 20.09 శాతం మందికి కొవిడ్ ఉన్నట్లు తేలింది.పరీక్షించుకున్న ప్రతి అయిదుగురిలో ఒకరికి కరోనా నిర్ధారణైంది. శ్రీకాకుళం, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 7,685 మంది కరోనాతో మృతిచెందారు.
ఏడు జిల్లాల్లో 74.76 శాతం కేసులు
* 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 9,446(74.76 శాతం) ఏడు జిల్లాల్లోనే వచ్చాయి. అత్యధికంగా శ్రీకాకుళంలో(1,680), చిత్తూరు(1,628), గుంటూరు(1,576), నెల్లూరు(1,258), కర్నూలు(1,158), అనంతపురం(1,095), విశాఖపట్నం(1,051)లోనే ఈ కేసులన్నీ ఉన్నాయి.
* రాష్ట్రంలో క్రియాశీలక కేసుల సంఖ్య 89,732కు చేరింది. చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధిక క్రియాశీలక కేసులున్నాయి.
అత్యధికంగా కృష్ణాలో 12 మంది మృతి
* రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 69 మంది కొవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 12 మరణాలు సంభవించాయి. నెల్లూరులో ఏడుగురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆరుగురు చొప్పున, అనంతపురం, కడప జిల్లాల్లో అయిదుగు చొప్పున, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో నలుగురు చొప్పున, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కర్నూలులో ఇద్దరు మరణించారు.
* రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకూ 1,59,94,607 నమూనాలు పరీక్షించారు.
* 24 గంటల వ్యవధిలో 4,304 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
అన్ని పడకలూ నిండినవి
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలోని కొవిడ్ వార్డులన్నీ నిండిపోయాయి. వెంటిలేటర్, ఐసీయూ, నాన్ ఐసీయూ, క్యాజువాలిటీ వార్డుల్లో పడకలు లేవని.. అన్నీ నిండాయని నోటీసు బోర్డులో పేర్కొన్న చిత్రమిది.
- ఈనాడు, విజయవాడ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవినీతి ‘ప్రసాద’ం.. దందాల ‘రాజ’సం!
ఇసుకలో కోట్లాది రూపాయల సారం.. ఇళ్ల పట్టాల్లోనూ నిబంధనల పేరిట బేరం.. కాగితాలకు దొరకని వ్యాపారం.. బినామీలు, అనుచరులతోనే వ్యవహారం.. వంతెన మార్గాన్నే మార్చి భూముల పందేరం.. కొవిడ్ విరాళాల్లో స్వాహాకారం.. మొత్తంగా.. ఆ గోదారి తీరం.. అక్కడి ప్రజాప్రతినిధికి వేయాలి అవినీతి హారం.. వెరసి పేదలు, సామాన్యుల హాహాకారం.. -
పేరుకే పెంపు.. ఊకదంపు
పేదలే నా ప్రాణం... వారి ఆయురారోగ్యాలే నా ధ్యేయం... ఆరోగ్యశ్రీ వారి కోసమేనంటూ... జగన్ తన ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు... వాస్తవంగా చూస్తే పథకానికే అనారోగ్యమొచ్చింది... ప్రచారం చేసుకుంటున్నంత గొప్పతనమేమీ లేదు! ప్రభుత్వ ఉద్యోగులను పట్టించుకోవడమే లేదు!! -
హీరో ఎవరు? విలన్ ఎవరు?
‘మనమంతా సినిమాకు పోతాం. ఆ సినిమాలో హీరో ఎందుకు నచ్చుతాడో, విలన్ ఎందుకు నచ్చడో అందరూ ఆలోచించాలి. -
ఓటమి ‘కాసు‘క్కూర్చుంది!
ఈ అయిదేళ్లలో గురజాల పట్టణంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఈ రోడ్లు కూడా గత ప్రభుత్వంలో వేసినవే. అందువల్లే ఈసారి ఇక్కడ మార్పు కావాలనుకుంటున్నాం. -
నిఘా విభాగాధిపతి పోస్టుకు సంజయ్ పేరు ఎలా ప్రతిపాదిస్తారు?
నిఘా విభాగాధిపతి పోస్టు కోసం ముగ్గురు అధికారుల పేర్లతో పంపిన ప్యానల్ జాబితాలో సీఐడీ విభాగాధిపతి ఎన్.సంజయ్ పేరును.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్రెడ్డి చేర్చడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పండుటాకులపై పగ.. ఇది జగన్ మార్కు దగా.. అ‘విశ్రాంత’ ఆవేదన
బాధ్యతల బరువును మోసి... జీవితమంతా ఎన్నో శ్రమలకోర్చి... ఇక హాయిగా ఉందామనుకున్న విశ్రాంత ఉద్యోగుల బతుకుల్లో జగన్ రేపిన కల్లోలం అంతా ఇంతా కాదు... ఐఆర్, డీఆర్లకు గండికొట్టి... క్వాంటం పెన్షన్లలో కొర్రీ పెట్టి... వచ్చే ఆ నాలుగు రూపాయలనూ సమయానికి రాకుండా చేసి...వారిని రోడ్డున పడేశారు. చివరకు వారూ ధర్నాలు చేసే పరిస్థితి తెచ్చారు. -
ఫాం-12 సమర్పించినా రశీదు ఇవ్వడం లేదు
ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్లపై ఉద్యోగులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫాం-12 సమర్పించినా కొన్ని చోట్ల రశీదులు ఇవ్వడం లేదు. -
నేడు 54 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. బుధవారం 69 మండలాల్లో తీవ్ర వడగాలులు, 105 మండలాల్లో వడగాలులు వీచాయి. -
గిరిజన మహిళలను దూషిస్తే కేసు నమోదు చేయరా?
‘‘యానాదోళ్ల అమ్మాయి తెదేపాలో చేరారు. ఆమె నెత్తిన రూపాయి పెడితే ఐదు పైసలు విలువ చేయరు. గతంలో వాలంటీరుగా ఉంటే.. గౌతమ్బాబు ఆత్మకూరు ఛైర్పర్సన్గా చేశారు. -
చెల్లెమ్మలకు ఏం సమాధానం చెబుతారు జగన్?
‘మీ ఆడబిడ్డలం కొంగు చాచి అడుగుతున్నాం. న్యాయం చేయండి. ఒకవైపు రాజశేఖరరెడ్డి బిడ్డ ఎన్నికల్లో నిలబడింది.. మరోవైపు రాజశేఖరరెడ్డి తమ్ముడు వివేకా హత్య కేసులో నిందితుడు బరిలో ఉన్నారు. -
జగన్.. మరీ ఇంత బరితెగింపా?
నా ఎస్సీలు.. అంటూ నిత్యం మైకు ముందు దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నట్లు నటించే జగన్ నిజస్వరూపం ఏమిటో మరోసారి బయటపడింది. -
మహాత్ముడు మన్నించినా.. ప్రజలు క్షమించరు!
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా అభ్యర్థి మొండితోక జగన్మోహనరావు నామినేషన్ ర్యాలీ సందర్భంగా బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు హంగామా సృష్టించారు. -
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల విచారణ నుంచి...
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
929 మంది వాలంటీర్లను తొలగించాం
ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్)ని ఉల్లంఘించినందున 929 మంది వాలంటీర్లను తొలగించామని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ హైకోర్టుకు నివేదించారు. -
సంక్షిప్త వార్తలు
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ను పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
యథా రాజ... తథా విద్య!
విద్య లేని వాడు వింత పశువు... మరి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేవారిని ఏమనాలి? పాఠశాల విద్యార్థులను బైజూస్,బకలారియేట్ విధానాలతో కలవరపెట్టి.. స్కూళ్లలో ఉపాధ్యాయుల ఉనికే లేకుండా చేసి... ఎయిడెడ్ పాఠశాలలను బెదిరించి...మూయించి... ఇంటర్ విద్యార్థులకిచ్చే ఉచిత పుస్తకాల పంపిణీ రద్దు చేసి.. ఇంటర్న్షిప్ పేరుతో డిగ్రీ విద్యార్థులతో రొయ్యలు ఒలిపించి.. పీజీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేసి.. విశ్వవిద్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు బలిచేసి... చదువుకోవాలనుకునే వారిని పక్కరాష్ట్రాలకు వలస పంపించింది అక్షరాలా... జగన్ సర్కారే! -
ప్రజా రక్షకులు కారు.. వైకాపా సేవకులు!
ఖాకీలంటే... ప్రజారక్షణకు రాఖీలు... కానీ జగన్ హయాంలో కొందరు... వైకాపా పోకిరీలుగా మారి... అధికార పార్టీకి చాకిరీ చేశారు. స్వతంత్రంగా నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ- ప్రజల ప్రాణాలు, ఆస్తిపాస్తులు, వారి హక్కులు, గౌరవమర్యాదలను కాపాడటం పోలీసుల విధ్యుక్త ధర్మం. -
‘కోడ్’ కొండెక్కుతోంది?
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 26న ‘ఎచీవర్స్ డే’ పేరుతో భారీ సమావేశం నిర్వహిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఐఏఎస్ అధికారి గుల్జార్పై నిప్పులు చెరిగిన హైకోర్టు
ఓ వ్యక్తికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చే విషయంలో హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఉత్తర్వులిచ్చిన ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ పూర్వ ముఖ్య కార్యదర్శి ఎన్.గుల్జార్పై హైకోర్టు నిప్పులు చెరిగింది. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)