Andhra News: రహస్యం బయటకొచ్చింది!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు ప్రభుత్వం రూ.25వేల కోట్ల మేర గ్యారంటీ ఇచ్చిన అంశం ఎట్టకేలకు అధికారికంగా బడ్జెట్ పుస్తకాల్లో నమోదైంది. 2021-22 ఆర్థిక
2020-21లోనే ప్రభుత్వ గ్యారంటీలు
నాటి బడ్జెట్ పుస్తకంలో చూపక వివాదమైన వైనం
నాడు గ్యారంటీ ఇవ్వలేదన్న మంత్రి బుగ్గన
తాజా బడ్జెట్ పుస్తకాల్లో చోటు
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు ప్రభుత్వం రూ.25వేల కోట్ల మేర గ్యారంటీ ఇచ్చిన అంశం ఎట్టకేలకు అధికారికంగా బడ్జెట్ పుస్తకాల్లో నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన నాటికే ఆ రూపేణా అప్పులు తెచ్చి వాడేసినా, ఆ విషయాన్ని శాసనసభకు సమర్పించే గ్యారంటీల లెక్కల్లో చేర్చలేదు. అప్పట్లోనే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిని ఈ విషయం ప్రశ్నిస్తే అసలు ఆ గ్యారంటీలు వినియోగించుకుంటే కదా అని సమాధానం ఇచ్చారు. నిజానికి అప్పటికే ఏపీఎస్డీసీ ద్వారా రుణం తెచ్చి కొంత సొమ్ము ఖర్చు చేసినట్లు బడ్జెట్ ఖర్చుల్లో చూపించారు. ఆ రుణానికి గ్యారంటీ సంగతి దాచిపెట్టారు. ‘ఆ గ్యారంటీలను కలిపితే అప్పటికే రుణ పరిమితి దాటిపోయేది. అందుకే గ్యారంటీల అంశాన్ని బడ్జెట్ పుస్తకాల్లో చూపలేదు’ అని ఆర్థిక నిపుణులు అప్పట్లోనే విమర్శించారు. ఈ గ్యారంటీలను బడ్జెట్ పుస్తకాల్లో చేర్చాలని తాము సూచించినా ప్రభుత్వ పెద్దలు వద్దన్నారని నాడు ఆర్థికశాఖలో పని చేసిన ముఖ్య అధికారులు వెల్లడించారు. అప్పట్లో దాచి పెట్టిన ఏపీఎస్డీసీ రుణాల గ్యారంటీలు ఇప్పుడు బయట పెట్టాల్సి వచ్చింది. బడ్జెట్ పుస్తకం 5/2లో అప్పులు, గ్యారంటీల వివరాలు శాసనసభకు సమర్పించాలి. ప్రస్తుతం బడ్జెట్ ప్రతిపాదన సందర్భంగా సభకు సమర్పించిన వివరాల్లో ఏపీఎస్డీసీకి రూ.25వేల కోట్ల గ్యారంటీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
2020లోనే గ్యారంటీ ఒప్పందాలు, మంత్రిమండలి ఆమోదాలూ!
రాష్ట్రాభివృధ్ధి కార్పొరేషన్ రుణాలు పొందేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులు బ్యాంకులతో గ్యారంటీ ఒప్పందాలు 2020 నవంబరులోనే పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యారంటీదారుగా, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణదాతలుగా, రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ రుణగ్రహీతగా, ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ సెక్యూరిటీ ట్రస్టీగా ఈ ఒప్పందం 2020 నవంబరు 5న కుదిరింది. ఎస్బీఐ, పీఎన్బీ, ఇండియన్ బ్యాంకు రుణదాతలు. ఈ మూడు బ్యాంకులు రూ.13,500 కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అదే రోజు ఎస్క్రో ఒప్పందమూ కుదిరింది.
* 2020 నవంబరు 24న 5 బ్యాంకులతో ఒప్పందం కుదిరింది. రూ.21,500 కోట్ల రుణం తీసుకునేందుకు వీలుగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎస్బీఐ రూ.6,000 కోట్లు, పీఎన్బీ రూ.5,000 కోట్లు, ఇండియన్ బ్యాంకు 2,500 కోట్లు, యూబీఐ రూ.5,000 కోట్లు, బ్యాంకు ఆఫ్ బరోడా రూ.3,000 కోట్ల రుణం ఇచ్చేందుకు ఆ ఒప్పందంలో అంగీకరించాయి. పై కార్యకలాపాలు పూర్తయ్యాక అన్ని జీవోలనూ ర్యాటిఫై చేస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేసింది. నవంబరు 27న నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో ఎజెండా అంశం 21 కింద దీన్ని మంత్రిమండలి ముందుంచారు. మూడు జీవోలకు సంబంధించి తీర్మానం 204/2020లో వాటన్నింటినీ మంత్రిమండలి ఆమోదించింది. అయినా, గ్యారంటీలను ప్రభుత్వం రహస్యంగా ఉంచింది.
ఎప్పుడో గ్యారంటీ జీవోలు
* ఏపీఎస్డీసీ నుంచి రుణం తెచ్చేందుకు ప్రభుత్వం 2020లోనే గ్యారంటీలు ఇచ్చింది. ఆ వివరాలు 2021 బడ్జెట్ పుస్తకాల్లో నమోదు కావాలి.
* రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్కు ప్రభుత్వం రూ.25వేల కోట్ల గ్యారంటీలు నిబంధనలు, షరతులకు లోబడి ఇస్తున్నట్లుగా 2020 నవంబరు 3న జీవో 92 విడుదలైంది.
* కార్పొరేషన్ రుణం తీసుకుని ఆ మొత్తం చెల్లించేందుకు వీలుగా అదనపు ఎక్సయిజ్ సుంకం విధించి ఆ మొత్తాన్ని బ్యాంకులకు ఎస్క్రో చేసేందుకు వీలు కల్పిస్తూ జీవో 90 వచ్చింది.
* కార్పొరేషన్ మూలనిధిని రూ.2,500 కోట్లకు పెంచుతూ జీవో 91 విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
మూడు నెలల్లో రూ.300 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం
గత మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.300 కోట్ల విలువైన నగదు, వస్తువులు, ఇతర ఉచితాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
రాష్ట్రంలో దయనీయ పరిస్థితుల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులు
రాష్ట్రంలో అయిదేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయులను దయనీయమైన పరిస్థితుల్లోకి నెట్టివేశారని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పింఛనర్ల ఐక్యవేదిక ఛైర్మన్ సూర్యనారాయణ అన్నారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా
వివేకా హత్య అంశంపై కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు