Andhra News: నా హయాంలో కొనలేదు.. వాడలేదు
‘పెగాసస్ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఎవరికీ తెలీదు. ఆ రాష్ట్రంలో నాకు తెలిసిన కొందరు అధికారుల్ని అడిగా. ఆ సాఫ్ట్వేర్ను అమ్ముకోవడానికి
2019 మే తర్వాత ఏం జరిగిందో ప్రభుత్వమే ప్రకటన చేయొచ్చు
పెగాసస్పై మమత ఏం మాట్లాడారో ఎవరికీ తెలియదు
ఆమె వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి వీడియోలూ లేవు
బ్యూరోక్రసీనే భయపడిపోతే దుర్మార్గుల నుంచి ప్రజల్ని ఎవరు రక్షిస్తారు?
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వెల్లడి
ఈనాడు, అమరావతి: ‘పెగాసస్ వ్యవహారంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అక్కడి అసెంబ్లీలో ఏం మాట్లాడారో ఎవరికీ తెలీదు. ఆ రాష్ట్రంలో నాకు తెలిసిన కొందరు అధికారుల్ని అడిగా. ఆ సాఫ్ట్వేర్ను అమ్ముకోవడానికి వెళ్లినవారు ఆమెను కలిసినప్పుడు.. ఫలానా వారు కొన్నారని ఆమెకు అబద్ధాలు చెప్పి ఉండొచ్చని వారు నాతో అన్నారు’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. తాను నిఘా విభాగాధిపతిగా పని చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, డీజీపీ కార్యాలయం, నిఘా విభాగం, ఏసీబీ, సీఐడీ సహా ప్రభుత్వ, ప్రైవేటు విభాగాలేవీ పెగాసస్ సాఫ్ట్వేర్ కొనటంగానీ, వాడటంగానీ చేయలేదని పేర్కొన్నారు. ట్రోజన్లు, మాల్వేర్లు వంటివీ ప్రభుత్వపరంగా వినియోగించలేదని చెప్పారు. 2015 నుంచి 2019 మార్చి నెలాఖరు వరకూ తాను నిఘా విభాగాధిపతిగా కొనసాగానని.. ఆ తర్వాత రెండు నెలల వరకూ ఏం జరిగిందో తెలుసని చెప్పారు. తన హయాంలో ఫోన్లు ఏవీ ట్యాప్ కాలేదన్న భరోసా ఇస్తున్నానని చెప్పారు. విజయవాడలోని ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
2019 మే తర్వాత పెగాసస్ కొన్నారో లేదో నాకు తెలీదు
‘పెగాసస్ వ్యవహారంలో 2019 మే తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే తాము పెగాసస్సాఫ్ట్వేర్ కొనలేదంటూ 2021 ఆగస్టులో డీజీపీ కార్యాలయమే సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తికి సమాధానమిచ్చింది. ఇతర విభాగాలు ఈ సాఫ్ట్వేర్ను కొన్నాయేమోనన్న సందేహం ఎవరికైనా ఉంటే సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడగొచ్చు. ఈ అంశంపై ప్రభుత్వమే ఒక ప్రకటన చేసినా ఫరవాలేదు. జనాల్లో అపోహలు, సందేహాలు, ఆందోళనలు రేకెత్తించేందుకే పెగాసస్ వ్యవహారంలో కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై కనీసం శాఖాపరమైన విచారణ జరుగుతుందన్న నమ్మకం కూడా నాకు లేదు. ఈ వ్యవహారంలో అసత్యాలు, విష ప్రచారాలతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న సాక్షి పత్రిక, సాక్షి ఛానల్, సీపీఆర్వో పూడి శ్రీహరి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, గుడివాడ అమరనాథ్, అబ్బయ్య చౌదరి, విజయసాయిరెడ్డి, పయనీర్ పత్రిక, స్వర్ణాంధ్ర, గ్రేటాంధ్ర వెబ్సైట్లపై పరువు నష్టం దావా వేయడానికి అనుమతివ్వాలని సీఎస్ కార్యాలయంలో సోమవారం వినతిపత్రమిచ్చా.
నాపై విచారణకు ఏనాడూ వెనకాడలేదు
నాపై ప్రభుత్వం జరిపిన విచారణలో నేను వెనక్కి తగ్గలేదు. తాత్సారం చేసే ఎత్తుగడలు వేయలేదు. పది, పన్నెండేళ్లు సాగదీయాలనుకోలేదు. ఈ రోజు రాలేను.. రేపు రాలేను.. ఫలానా కారణాలతో రాలేను.. పిటిషన్ అక్కడ పెండింగ్లో ఉంది. ఇక్కడ పెండింగ్లో ఉంది అంటూ ఏ రోజూ తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. త్వరగా విచారణ జరిపి నిజానిజాలేమిటో తేల్చమనే అడుగుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం నాపై విచారణ జరిపి సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సమ్మతి కోసం ప్రతిపాదనలు పంపించింది. వాటిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని నేనూ కేంద్రాన్ని కోరాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని పత్రాలు రాలేదని వారు చెబుతున్నారు. నా సస్పెన్షన్ చెల్లదని, అది చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దానిపై రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుంది. ఏడాదిగా అక్కడ పెండింగ్లో ఉంది. వీటిలో జాప్యానికి నేను కారణం కాదు.
ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పినవన్నీ అబద్ధాలే
* ఆంధ్రప్రదేశ్లో 37 మంది డీఎస్పీలకు పదోన్నతులిస్తే 35 మంది ఓ సామాజికవర్గం వారే ఉన్నారని, అందుకు ఏబీ వెంకటేశ్వరరావే కారణమంటూ 2019 ఎన్నికలకు ముందు ఓ వ్యక్తి చేతిలో కాగితాలు ఊపుతూ మరీ ఎన్నికల సంఘానికి, గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అదంతా అబద్ధమని ఇప్పుడు హోం మంత్రే అసెంబ్లీలో చెప్పారు.
* ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారంటూ వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ల వ్యవహారంలో అప్పట్లోనే మాకు నోటీసులొచ్చాయి. హోంశాఖ తరఫున సమాధానాలిచ్చాం. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత.. ఆరు నెలలకు వైవీ సుబ్బారెడ్డి కేసు ఉపసంహరించుకున్నారు. సజ్జల వేసిన కేసులో పిటిషన్దార్ల తరఫున ఎవరూ హాజరు కావట్లేదంటూ కోర్టే డిస్మిస్ చేసింది.
అవి కొంటే.. వారు మావోయిస్టుల దాడిలో బలయ్యేవారు కాదు
‘అప్పట్లో నేను ప్రతిపాదించిన ఏరోస్టాట్, యూఏవీ పరికరాలు కొని ఉంటే అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యలు జరిగి ఉండేవి కావు. వారిని కాపాడుకోగలిగే వాళ్లం. ఛత్తీస్గఢ్లో పదుల సంఖ్యలో సైనికులు మావోయిస్టుల దుశ్చర్యకు బలైపోయేవారు కాదు.
* వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నాకు తెలిసిన విషయాల్ని సీబీఐ అధికారులకు చెప్పాను’ అని వివరించారు.
* ‘నాకు రెండేళ్ల సర్వీసు ఉంది. దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలి. రెండేళ్ల తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు చూద్దాం.’ (రాజకీయాల్లోకి వస్తారా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా)
ఐపీఎస్ అధికారిగా ఉండటమే.. నా బలహీనత అనుకుంటే ఎలా?
ఐపీఎస్ అధికారిగా ఉండటమే నా బలం అనుకున్నా. దాన్నే నా బలహీనతగా వారు భావిస్తే ఎలా? ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి నన్నేమైనా అనొచ్చా? ఇలా అయితే అఖిల భారత సర్వీసు అధికారుల్లో అభద్రతభావం రాదా? దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు, అరాచకాల నుంచి ప్రజల్ని రక్షిస్తూ వచ్చిన నేను ఇప్పుడు వాటికే బలైపోయాను. నన్ను నేనే రక్షించుకోలేకపోతే ప్రజల్ని ఏం రక్షిస్తాను? నా ఉద్యోగ ధర్మాన్ని ఎలా నిర్వహిస్తాను? ఈ రోజు నేను ఎదుర్కొంటున్న పరిస్థితే రేపు మరో అధికారికి రావచ్చు. ఇలా అయితే బ్యూరోక్రసీ అంతా బెంబేెలెత్తిపోదా? అందరూ భయపడిపోయి పారిపోతే దుర్మార్గుల నుంచి ప్రజల్ని రక్షించేది ఎవరు?
అధికారుల్ని బంతాట ఆడుకోవచ్చు అనుకుంటున్నారా?
అఖిల భారత సర్వీసు అధికారులను బంతాట ఆడుకోవచ్చు.. ఉద్యోగుల్ని ఫుట్బాల్ ఆడుకోవచ్చు. వారేమీ చేయలేరులే.. అనే ధోరణితో ఉంటే ఎలా? ఉద్యోగులమే కానీ మేమూ మనుషులమే. మాకంటూ వ్యక్తిత్వం ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు అఖిల భారత సర్వీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు సంబంధిత అధికారికి వాటిని ఖండించే హక్కు నియమావళిలోనే ఉంది. అందుకే నేను మాట్లాడుతున్నా.
అబద్ధపు శిలువ మోయాల్సి వచ్చింది
నన్ను సస్పెండ్ చేసిన రోజు అర్ధరాత్రి సీపీఆర్వో పూడి శ్రీహరి ఆరు పేజీల డాక్యుమెంటును మీడియాకు విడుదల చేశారు. రూ.25 కోట్ల కుంభకోణానికి, దేశద్రోహానికి పాల్పడినట్లు, దేశ రహస్యాలను విదేశాలకు చేరవేసినట్లు అందులో అసత్య ఆరోపణలు చేశారు. 2020 ఫిబ్రవరిలో నన్ను ప్రభుత్వం సస్పెండు చేయగా డిసెంబరు 18న నాపై అభియోగాలు మోపుతూ ఉత్తర్వులిచ్చింది. వాటిలో ఎక్కడా పూడి శ్రీహరి విడుదల చేసిన డాక్యుమెంటులోని ఆరోపణలు లేవు. ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదన్న సత్యం.. నాపై జరిగిన విచారణలో తేటతెల్లమైంది. కానీ శ్రీహరి చేసిన అసత్య ప్రచారం, వ్యక్తిత్వ హననం వల్ల అన్ని నెలలపాటు నేను ఆ అబద్ధపు శిలువ మోయాల్సి వచ్చింది’ అని ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జాతీయ రహదారిని.. జగన్కు రాసిచ్చేశారా?
నా దారి రహదారి.. అడ్డం రాకు.. ఇది నరసింహ సినిమాలో రజనీకాంత్ డైలాగ్. సీఎం జగన్ కూడా చెన్నై- కోల్కతా జాతీయ రహదారి తనదే అంటున్నారు. అందుకు ఎవరూ అడ్డు చెప్పకూడదంటున్నారు. -
సీఎం వస్తున్నారని.. సాగునీటి కాలువను పూడ్చేశారు
సీఎం జగన్ ‘సిద్ధం’ సభలకు చెట్లు కొట్టేయడమే కాదు.. సాగునీటి కాలువలను సైతం మట్టితో పూడ్చేస్తున్నారు. -
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
కృష్ణా జిల్లాలోని గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. ఎన్నికల్లో అక్కడి ప్రజలు ఇచ్చే తీర్పుపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి ఉంటుంది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఊరూరా మాదక ద్రవ్యాలతో మత్తెక్కిన ఆంధ్రా!
ఆంధ్రప్రదేశ్ను గంజాయి ఉపద్రవం కమ్మేసింది. దీని వినియోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. విశాఖ మన్యం నుంచి ఏటా రూ.10 వేల కోట్ల విలువైన గంజాయి మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు దేశ, విదేశాలకు తరలుతోంది. -
ఈసారైనా ఒకటో తేదీన.. ఇంటి దగ్గరే పింఛన్లిస్తారా?
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు వైకాపా ప్రభుత్వం సిద్ధమైంది. -
అవునా.. స్టీల్ప్లాంటు నష్టాల్లో ఉందా?
విశాఖ ఉక్కుకు జగన్ మళ్లీ మొండిచేయి చూపించారు. ‘స్టీలుప్లాంటు నష్టాల్లో ఉందా?’ అంటూ ఏమీ తెలియనట్లు ఆయన కార్మికసంఘాల నేతలను ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
బొగ్గు నిల్వలు చూస్తే భయం
ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సమస్య తీరడం లేదు. రెండు మూడు రోజులకు మించి ప్లాంట్ల దగ్గర బొగ్గు నిల్వలు లేవు. ఏవైనా ఇబ్బందులతో ఒక్కరోజు బొగ్గు సరఫరా నిలిచినా.. ఆ ప్రభావం థర్మల్ యూనిట్ల ఉత్పత్తిపై పడనుంది. -
బొత్స కుటుంబం కబ్జా కోరల్లో..గర్భాం మాంగనీస్ గనులు
విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లాలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులను మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం కబ్జా చేసి, భారీగా దోచుకుందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై రాజీనామా కత్తి
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో వైకాపా నేతలు వాలంటీర్ల మెడపై రాజీనామా కత్తి పెట్టారు. వాలంటీర్లంతా రాజీనామా చేయాలని, అలాంటి వారికే అధికారంలోకి రాగానే మళ్లీ ఆ ఉద్యోగం ఉంటుందని బెదిరిస్తుండటంతో మంగళవారం 134 మంది రాజీనామా చేశారు. -
మార్కులకూ.. ప్రమాణాలకూ పొంతనెక్కడ?
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో విద్యార్థులు భారీగా మార్కులు సాధిస్తున్నా, అభ్యసన సామర్థ్యాల్లో మాత్రం వెనకబడుతున్నారు. -
కళింగ నేలపై కపట ప్రేమ
సిక్కోలు జీవనాడి వంశధార పరివాహక ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. రిజర్వాయర్ నిర్మాణానికి భూములు, ఊళ్లు, ఇళ్లు త్యాగం చేసిన నిర్వాసితులను ఆదుకుంటాం. కుడి, ఎడమ కాలువలను పటిష్ఠం చేసి కరకట్టలు నిర్మిస్తాం.’ -
హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలి
బలం, ధైర్యం, సంకల్పశక్తికి ప్రతిరూపమైన హనుమంతుడి దయతో ప్రజల కష్టాలు తొలగిపోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ‘ఎక్స్’ వేదికగా ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మనవాళ్లు అయితేనే భద్రత!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైకాపా నాయకులకు మాత్రమే గన్మన్లను కేటాయిస్తోంది. ప్రతిపక్ష నేతల విషయంలో వివక్ష చూపిస్తోంది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
కడప కోర్టు ఉత్తర్వులను రద్దు చేయండి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులపై మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఈనెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. -
అమరనాథ్ యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలి
అమరనాథ్ యాత్రకు వెళ్లేవారు ఆయా జిల్లాల పరిధిలోని జీజీహెచ్లో వైద్యపరీక్షలు చేయించుకోవాలని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకురాలు పద్మావతి సూచించారు. -
నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు
రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. మంగళవారం 66మండలాల్లో తీవ్ర వడగాలులు, 84మండలాల్లో వడగాలులు వీచాయి. -
షెడ్యూల్ విడుదలయ్యాక రూ.141 కోట్ల సొత్తు స్వాధీనం
ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి మంగళవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.141 కోట్ల సొత్తు (నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచితాలు, ఇతర వస్తువులు) జప్తు చేశామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM