Andhra News: బండి తిప్పలేం.. బండ మోయలేం!
మొన్నటికి మొన్న.. వంట నూనెలు లీటరుకు రూ.70దాకా పెరిగాయి. పేద, మధ్య తరగతి జీవుల వంటింటి ఖర్చుకు మంట పెట్టాయి. ఈ భారం తట్టుకునేదెలా అని తల్లడిల్లుతుంటే...
ఇంటింటికీ తప్పని ఇంధన సెగ
రూ.50 పెరిగిన వంట గ్యాస్ ధర
రెండోరోజూ పెట్రో ధరల పెంపు
అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో రూ.వెయ్యి దాటిన సిలిండర్
కుప్పంలో లీటరు రూ.100 దాటుతున్న డీజిల్, రూ.114 పైన పెట్రోలు
ఈనాడు, అమరావతి: మొన్నటికి మొన్న.. వంట నూనెలు లీటరుకు రూ.70దాకా పెరిగాయి. పేద, మధ్య తరగతి జీవుల వంటింటి ఖర్చుకు మంట పెట్టాయి. ఈ భారం తట్టుకునేదెలా అని తల్లడిల్లుతుంటే... ఇంధన ధరల పిడుగు పడనే పడింది. మంగళవారం నుంచి లీటరు పెట్రోలు ధర 88 పైసలు, డీజిల్ 83 పైసలు చొప్పున పెరిగాయి. అంతలోనే వంట గ్యాస్ గంట కొట్టేసింది. నేనేం తక్కువ తిన్నానా అంటూ... సిలిండర్కు రూ.50 చొప్పున భగ్గుమంది. ఆస్తి, చెత్త పన్నుల బాదుడుతో ప్రభుత్వం కష్టజీవుల్ని పిండేస్తుండగా... ఇప్పుడేమో ఇంటింటికీ ఇంధన సెగ ఎక్కువవుతోంది. మార్చి ముగిసేలోగా ఇంకెన్ని బాదుడులు ఉంటాయో? ఇంటి ఖర్చు ఇంకెంత పెరుగుతుందో? అని పేద కుటుంబాలతో పాటు మధ్య తరగతివారు... చిరు వ్యాపారులు వాపోతున్నారు. తమకొచ్చే కొద్దిపాటి ఆదాయం ఈ ఖర్చులకే సరిపోతుందనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. పెరిగిన ధరల నేపథ్యంలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పలు చోట్ల గృహవినియోగ సిలిండర్ రూ.వెయ్యి దాటేసింది. చిత్తూరు జిల్లా కుప్పంలో డీజిల్ ధర రూ.100 పైగా చేరింది.
ధర పేలింది...
వంటగ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర విజయవాడలో సోమవారం దాకా రూ.922 ఉంది. దీనిపై రూ.50 చొప్పున పెంచుతున్నట్లు ఇంధన సంస్థలు మంగళవారం పేర్కొన్నాయి. ఫలితంగా సిలిండర్ ధర రూ.972కి చేరింది.
* వంటగ్యాస్ సిలిండర్ ధర చివరిగా గతేడాది అక్టోబరులో పెరిగింది. మళ్లీ ఇప్పుడు రూ.50 చొప్పున పెంచారు.
* రాష్ట్రంలో 1.43 కోట్ల వంటగ్యాస్ కనెక్షన్లున్నాయి. ప్రతినెలా గ్యాస్ తీసుకునే కుటుంబాలు 1.15 కోట్లుంటాయని అంచనా. పెరిగిన ధరల ప్రకారం చూస్తే... నెలకు రూ.57.50 కోట్ల భారం వినియోగదారులపై పడుతుంది.
* గతేడాది మార్చిలో గృహ వినియోగ సిలిండర్ ధర రూ.841. అప్పటి ధరతో పోలిస్తే.. సిలిండర్కు రూ.131 చొప్పున పెరిగింది.
* వంటగ్యాస్ సిలిండర్పై ఇచ్చే రాయితీని ప్రభుత్వం క్రమంగా కుదించేసింది. 2020 మార్చిలో సిలిండర్ ధర రూ.833 ఉన్నప్పుడు.. రాయితీగా రూ.255 వినియోగదారుల ఖాతాల్లో జమ చేసింది. తర్వాత నుంచి క్రమంగా రాయితీకి కోత పెడుతూ వచ్చింది.
* ప్రస్తుతం సిలిండర్ ధర రూ.972 అయింది. రాయితీ రూపంలోఅందేది సగటునసిలిండర్కు రూ.15 మాత్రమే.
రూ.వెయ్యి దాటేసిన సిలిండర్
చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని పలు మండలాల్లో వంటగ్యాస్ కొనాలంటే రూ.వెయ్యి పైన పెట్టాల్సిందే. ఇంధన సంస్థలు ఒక్కో సిలిండర్పై రూ.50 చొప్పున పెంచడంతో.. అక్కడ సిలిండర్ ధరలు రూ.1,019 వరకు చేరాయి. అనంతపురం జిల్లా ఉరవకొండలో రూ.1,019, ఎన్పీ కుంటలో రూ.1,016 ఉండగా.. చిత్తూరు జిల్లా గుర్రంకొండలో రూ.1,008 చొప్పున ధర ఉంది. దూరానికి అనుగుణంగా కొన్ని ప్రాంతాల్లో సిలిండర్ ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.2,165 అయింది.
దిల్లీలో రూ.949... వంటగ్యాస్ సిలిండర్కు రూ.50 చొప్పున పెరగడంతో... దిల్లీ, ముంబయిల్లో ధర వరుసగా రూ.949.50కు, కోల్కతాలో రూ.976కు చేరుకుంది. గత ఏడాది అక్టోబరు 6 తర్వాత దేశంలో వంటగ్యాస్ ధరలను సవరించడం ఇదే తొలిసారి. 2021 జులై, 2021 అక్టోబరు మధ్య ఒక్కో సిలిండర్ ధర రూ.100 మేర పెరిగింది. అప్పట్లో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో రేట్ల నెలవారీ సవరణ నిలిచిపోయింది. 2014 జనవరిలో సిలిండర్ ధర అత్యధికంగా రూ.1,241కి చేరుకుంది. అప్పట్లో కేంద్రం ప్రభుత్వం ఒక్కో గ్యాస్బండపై రూ.600 వరకు సబ్సిడీ అందించేది. 2020 మే నుంచి దాన్ని నిలిపివేసింది. రవాణా ఛార్జీల భారాన్ని తగ్గించేలా స్వల్ప మొత్తాన్ని వినియోగదారులకు అందిస్తోంది. తాజా పెంపుతో 19 కేజీల వాణిజ్య వినియోగ సిలిండర్ ధర రూ.2,003.50కు చేరుకుంది.
రాష్ట్రంలోనే పెట్రో ధరలు అధికం
దేశీయంగా 137 రోజుల విరామం తర్వాత పెట్రో ధరల్లో పెరుగుదల మొదలైంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ 112 డాలర్లకు చేరింది. దీంతో దేశీయంగానూ ధరల పెరుగుదల ఉంటుందనే సంకేతాలొచ్చాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలొచ్చాక ఇంధన బాదుడు ఉంటుందనే ఊహాగానాలూ వెలువడ్డాయి. అందుకు అనుగుణంగానే మంగళవారం నుంచి ధరల పెరుగుదల మొదలైంది.
* మంగళవారం లీటరు పెట్రోలుపై 88 పైసలు, డీజిల్పై 83 పైసల చొప్పున పెరిగాయి. బుధవారం కూడా పెట్రోలుపై 87 పైసలు, డీజిల్పై 84 పైసల చొప్పున పెంచారు. దీంతో రెండు రోజుల్లోనే లీటరు పెట్రోలుపై రూ.1.75, డీజిల్పై 1.67 చొప్పున పెరుగుదల నమోదైంది.
* ధరల పెరుగుదలతో బుధవారం విజయవాడలో లీటరు పెట్రోలు రూ.111.65, డీజిల్ రూ.97.71 (ప్రాంతాల వారీ మారుతుంది) చేరనుంది. పెరుగుదల ఇంకా ఉండొచ్చని డీలర్లు అంచనా వేస్తున్నారు.
* రాష్ట్రంలోనే అత్యధికంగా చిత్తూరు జిల్లా కుప్పంలో లీటరు పెట్రోలు ధరలు రూ.114.53, డీజిల్ రూ.100.06కు చేరనున్నాయి.
* గతేడాది నవంబరులో లీటరు పెట్రోలు ధర రూ.116, డీజిల్ ధర రూ.108గా ఉన్నాయి. ఆ నెలలో కేంద్రం లీటరు పెట్రోలుపై రూ.5, డీజిల్పై రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకం తగ్గించింది. వీటిపై పన్నులూ తగ్గడంతో.. రాష్ట్రంలో పెట్రోలు ధర రూ.110, డీజిల్ రూ.96 అయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఎగబాకుతున్నాయి.
* కేంద్రం బాటలోనే నడిచిన పలు రాష్ట్రాలు పన్నులను తగ్గించుకోవడంతో.. ఇంధన ధరలు దిగొచ్చాయి. రాష్ట్రంలో ఎలాంటి తగ్గింపునూ ప్రకటించలేదు. దీంతో దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే పెట్రోలు, డీజిల్ ధరలు మన రాష్ట్రంలోనే అధికం. ముడిచమురు ధరలకు అనుగుణంగా పెరుగుదల ఉంటే.. వినియోగదారులకు ఇవి మరింత భారంగా పరిణమించనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వైన్స్.. ప్రొప్రయిటర్ జగన్
రాష్ట్రంలో ఎవరైనా సరే.. మూడుకు మించి మద్యం సీసాలు కలిగి ఉండటం నేరం. కానీ సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షలకొద్దీ మద్యం సీసాలు గలగలలాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగిపొర్లుతున్నాయి. -
సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. -
పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. -
పేదలతో చెడు‘గూడు’!
‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా..’ అని జగన్ చెబితే.. నమ్మి ఓటేశారు పేదలు. తీరా అధికారంలోకి వచ్చాక.. ‘దోచుకోవడం దాచుకోవడం’ మీద పెట్టిన శ్రద్ధలో కాస్తయినా పేదలకు ఇళ్లు కట్టించడంపైన పెట్టలేదు జగన్. -
మంచాలలో ప్రబలిన అతిసారం
గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మంచాల గ్రామంలో అతిసారం ప్రబలింది. ఇక్కడ సుమారు 100 మందికి పైగా గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
ఎడ్సెట్-2024 నోటిఫికేషన్ విడుదల
బీఎడ్ 2024-25లో ప్రవేశాల కోసం ఉన్నత విద్యామండలి తరఫున ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) శుక్రవారం ఎడ్సెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. -
‘కౌలు రైతుకు’ జగన్ కాటు!
‘‘దేశంలో ఎక్కడా లేనట్లుగా కౌలు రైతులకు మేం తోడుగా ఉంటున్నాం. గ్రామ సచివాలయంలోనే సాగుదారు హక్కు కార్డులు అందిస్తున్నాం. వారికి ఇక రైతు భరోసాతోపాటు అన్ని పథకాలు అందుతాయి’’ అంటూ 2023 సెప్టెంబరులో రైతు భరోసా విడుదల సందర్భంగా సీఎం జగన్ గొప్పలు చెప్పారు. -
జనం కళ్లలో జగన్ దుమ్ము
సిద్ధం యాత్రలో భాగంగా శుక్రవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఏడీబీ రోడ్డు మీదుగా సాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ ఇది.. మధ్యలో ఒక్కసారి ఆయన బస్సు దిగి చూస్తే రోడ్డు దుస్థితి తెలిసేవి. -
ఐదేళ్లలో భారీగా పెరిగిన బొత్స కుటుంబ ఆస్తి
విజయనగరం జిల్లా చీపురుపల్లి వైకాపా అభ్యర్థి (వైకాపా), మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబ ఆస్తి ఐదేళ్లలో సుమారు రెండున్నర రెట్లు పెరిగింది. -
రోజాకు రూ. 10.63 కోట్ల ఆస్తులు
వైకాపా అధికారంలోకి వచ్చాక నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా ఆర్థిక స్థితిగతులు మారిపోయాయి. 2019లో ఆమె చరాస్తులు రూ.2.74 కోట్లు. ఇప్పుడు రూ.4.58 కోట్లు. -
రైతు సదస్సు పేరుతో వైకాపా భోజనాలు
పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో రైతు అవగాహన సదస్సు పేరుతో వైకాపా నాయకులు ఎన్నికల నియమావళిని అతిక్రమించారు. -
ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. -
గిగ్గోడు వినిపించలేదు
ప్రభుత్వ కొలువులు ఇవ్వరు.. పరిశ్రమల్ని తీసుకురారు.. నైపుణ్య శిక్షణ ఇస్తారా అంటే అదీ లేదు.. దాంతో బతుకు బండి నడవడానికి.. డెలివరీ బాయ్, బైక్ రైడర్ లాంటి పనులు చేస్తూ ‘గిగ్’ కార్మికులుగా మారుతున్నారు యువత. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
జగన్ మాట్లాడుతుంటే జనం వెళ్లిపోయారు
సీఎం జగన్ కాకినాడ గ్రామీణ మండలం అచ్చంపేట కూడలి సమీపంలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మొదట్లో కాకినాడ గ్రామీణ అభ్యర్థి కురసాల కన్నబాబు ప్రసంగించారు. -
సిద్ధం సభకు బస్సుల తరలింపు.. ప్రయాణికులకు నరకయాతన
కాకినాడ గ్రామీణంలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం సిద్ధం సభకు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. -
సామాజికవర్గం పేరుతో మహిళను దూషించిన వైకాపా నేత రాజమోహన్రెడ్డి
‘యానాదోళ్ల అమ్మాయి.. నెత్తిమీద రూపాయి పెడితే 5 పైసల విలువ చేయదు..’ అంటూ వైకాపా నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఆత్మకూరు ఛైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. -
సంక్షేమ పథకాలు ఓట్లు పొందే మార్గాలు కాకూడదు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు సంపాదించే మార్గాలు కాకూడదని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రాజనీతిశాస్త్ర విశ్రాంత ఆచార్యులు కొండవీటి చిన్నయసూరి పేర్కొన్నారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం